విద్యుత్ సమస్యతోనే హోటల్లో ప్రమాదం
- January 22, 2016
కొత్త సంవత్సర వేడుకల సందర్భంగా దుబాయ్లో సంభవించిన అగ్ని ప్రమాదంపై దుబాయ్ పోలీసులు ఓ నిర్ధారణకు వచ్చారు. విచారణలో ఎక్కడా పేలుడు పదార్థాలుగానీ, గ్యాస్ లేదా పెట్రోల్ మంటలు సంభవించినట్లు ఆధారాలు దొరకలేదనీ, పూర్తిగా విద్యుత్ సమస్య కారణంగానే మంటలు సంభవించి ఉండొచ్చని దుబాయ్ పోలీస్ చీఫ్ ఖామిస్ మట్టర్ అల్ మజైనా చెప్పారు. 63 అంతస్తులు గల అడ్రస్ హోటల్ కమ్ రెసిడెన్షియల్ బ్లాక్లో జరిగిన ఈ ప్రమాదంలో ప్రాణ నష్టమేమీ సంభవించలేదు. కొందరికి గాయాలు మాత్రం అయ్యాయి. ప్రమాదం జరిగిన తీరుకు సంబంధించి పలువురు చిత్రీకరించిన వీడియోలను సాక్ష్యంగా తీసుకుని, పరిశీలించారు. వీటిల్లో ప్రమాదం అనంతరం మండుతున్న చిన్న చిన్న వస్తువులు కిందకి జారాయనీ, అవి ఫైర్ వర్క్స్ కావని అధికారులు తేల్చారు.
తాజా వార్తలు
- ఇరాన్ నౌకలను కాల్చిపారేయండి: ట్రంప్
- వీసా బాధలు ఇక లేవు: భారతీయుల కోసం ఫ్రాన్స్ కీలక నిర్ణయం!
- కువైట్ వెలుపల ఉన్నవారి వీసాలకు పొడిగింపు లేదు..!!
- టికెట్ రీఫండ్ సర్వీస్ ప్రకటించిన లేబర్ మినిస్ట్రీ..!!
- అబ్షర్ పర్మిట్తో ఆరు కేటగిరీ వారికి మక్కాలోకి ప్రవేశం..!!
- ప్రాపర్టీ ధరలు, అద్దెలను 30% పెంచనున్న మెట్రో గోల్డ్ లైన్..!!
- అబుదాబి 95% తగ్గిన సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగం..!!
- ఖతార్ ఎయిర్వేస్ యూఏఈ, సిరియాకు రోజువారీ విమాన సర్వీసులు పునఃప్రారంభం
- ఈజీ మనీ కోసం మహిళ అదిరిపోయే స్కెచ్..
- రాంబిల్లిలో గ్రీన్ ఎనర్జీ విప్లవం









