పొరుగూరు వెళ్ళిన పెంపుడు సింహం
- January 22, 2016
సింగల్ గానే సింహం పొరుగూరు వెళ్లి , ప్రజలారా... ఎలా ఉన్నారంటూ ఘర్జిస్తుంటే ఊరూవాడ హడలిపోయారు. క్షణాల్లో ఆ ప్రాంతాలన్నీ నిర్జన ప్రదేశాలుగా మారిపోయాయి బెంబేలెత్తిన జనం ఎట్టకేలకు వన్యప్రాణి సంరక్షణ అధికారులకు ఈ సమాచారం అందించారు. ఓ పెంపుడు సింహం తన యజమాని వద్ద నుండి తప్పించుకొని గురువారం సాయంత్రం 7 గంటల సమయంలో దుబాయ్ సమీపంలోని ' అల్ బర్ష ' ప్రాంతానికి పర్యటనకు వెళ్ళింది. భయపడిపోయిన ప్రజలు ఇచ్చిన పిర్యాదుకు స్పందించి దుబాయ్ మునిసిపాలిటీ నుంచి వన్యప్రాణి ప్రత్యేక అధికారులను అక్కడకు పంపించారు. వారు నానా అవస్థలు పడి ఆ మృగరాజును ఎట్టకేలకు బందించినట్లు స్థానిక పత్రికలు వార్తను ప్రచురించాయి. ఈ వార్తను సంబంధిత అధికారులు సైతం దృవీకరించారు. కాగా శుక్రవారం ఉదయం 11 గంటలకు ఆ సింహంను ' జూ ' కు తరలించారు. అనంతరం అధికారులు మాట్లాడుతూ, అంతరించిపోతున్న అరుదైన అడవి జంతువులను ఎంతటి వారైనా బంధించి పెంచుకోవడం పెద్ద నేరమన్నారు. యు.ఎ.ఇ. సమాఖ్య చట్టాల కింద ఇది విరుద్ధమైన తీవ్ర చర్య అని పేర్కొన్నారు. ఇటీవల దుబాయ్ సమీపంలో కొందరు తమ కార్లలో పెద్ద పులులను పక్కన కూర్చెండబెట్టుకొని షికార్లకు వెళుతున్నట్లు ఆ ప్రాంతీయులు పలుమార్లు గమనించి తమకు తెలిపారన్నారు. ఆఫ్రికా అడువుల నుండి క్రూర జంతువులను రహస్యంగా దిగుమతి చేసుకోవడం గత కొన్నేళ్లుగా జరుగుతూనే ఉంది
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







