ఐస్ క్రీం తినడంతో నోటి నుంచి రక్తం
- March 02, 2020
హైదరాబాద్:పాతబస్తీలో దారుణం చోటుచేసుకుంది. ఐస్ క్రీం తిన్న వారి నోటి నుంచి రక్తం రావడం కలకలం రేపింది. పాతబస్తీలోని ఒవైసీ కాలనీలో ఈ ఘటన జరిగింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఓవైసీ నగర్ లోని ఫయాజ్ కుటుంబానికి చెందిన ముగ్గురు సభ్యులు.. రోడ్లపై తిరుగుతూ ఐస్ క్రీంలు అమ్మే తోపుడు బండి దగ్గర ఐస్ క్రీం కొనుగోలు చేసి తిన్నారు. అది నాలుకపై వేసుకున్న వెంటనే నాలుక పగిలి రక్తం రావడాన్ని గుర్తించి ఆందోళనకు గురయ్యారు. వెంటనే ఐస్ క్రీం అమ్మిన వ్యక్తిని పట్టుకొని.. సంతోష్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు ఐస్ క్రీం అమ్మిన వ్యక్తిని అదుపులోకి తీసుకొని పోలీసులు విచారిస్తున్నారు.
తాజా వార్తలు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పై ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్
- దక్షిణ కొరియా సంస్థతో వ్యూహాత్మక ఒప్పందం
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు
- అక్టోబర్ 25 నుంచి ఢిల్లీకి ఎమిరేట్స్ ఏ380 సర్వీసులు
- TCS కు భారీ లాభం
- దుబాయ్లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్







