కరోనా కంట్రోల్ లోనే ఉంది..ప్రెస్ మీట్ లో కువైట్ హెల్త్ మినిస్ట్రి వెల్లడి
- March 04, 2020
కువైట్:కువైట్ లో కరోనా వైరస్ ప్రభావం అదుపులోనే ఉందని ఆ దేశ ఆరోగ్యశాఖ వెల్లడించింది. గత 24 గంటల్లో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదని ప్రెస్ మీట్ లో హెల్త్ మినిస్ట్రి అసిస్టెంట్ అండర్ సెక్రెటరీ డాక్టర్ బుతైన అల్ ముదఫ్ వెల్లడించారు. ప్రస్తుతం కువైట్ లో 56 మందికి కరోనా పాజిటీవ్ గా ఉన్నట్లు నిర్ధారణ అయ్యిందని ఆమె తెలిపారు. అయితే..కరోనా వైరస్ ను కంట్రోల్ చేసేందుకు కువైట్ చేపట్టిన చర్యలను ఈజిప్ట్ మీడియా విమర్శించటాన్ని ఆమె తప్పుబట్టారు. వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకే ఈజిప్ట్ నుంచి విమానాల రాకపోకలపై తాత్కాలిక ఆంక్షలు విధించామని వివరించారు. ఈ ఆంక్షలు ఒక్క ఈజిప్ట్ కు మాత్రమే కాదని సిరియా, ఇండియా, బంగ్లాదేశ్ ఫ్లైట్స్ పై కూడా ఆంక్షలు కొనసాగుతున్న విషయాన్ని గుర్తు చేశారు. ఉద్దేశపూర్వకంగా ఈజిప్ట్ విమానాలను అడ్డుకోవటంగానీ, అక్కడి నుంచి తమ వారిని వెనక్కి రప్పించటంగానీ చేయటం లేదని..వైరస్ పోరాటంలో తప్పనిసరి పరిస్థితుల కారణంగా ఆంక్షలు విధించాల్సి వచ్చిందని వివరించారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!







