మార్చి 8 నుంచి ఇండియా నుంచి వచ్చే ప్రయాణీకులకు PCR తప్పనిసరి

- March 04, 2020 , by Maagulf
మార్చి 8 నుంచి ఇండియా నుంచి వచ్చే ప్రయాణీకులకు PCR తప్పనిసరి

కువైట్:డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌, ఇండియాతోపాటు ఫిలిప్పీన్స్‌, బంగ్లాదేశ్‌, ఈజిప్ట్‌, సిరియా, అజర్‌బైజాన్‌, టర్కీ, శ్రీలంయ, జార్జియా మరియు లెబనాన్‌ నుంచి కువైట్‌కి వచ్చే వారికి పిసిఆర్‌ మెడికల్‌ సర్టిఫికెట్‌ తప్పనిసరి అని ఆదేశాలు జారీ చేసింది. కరోనా వైరస్‌ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు అధికారులు. ఆయా దేశాల్లోని కువైట్‌ ఎంబసీ అప్రూవ్‌ చేసిన హెల్త్‌ సెంటర్స్‌ నుంచి పిసిఆర్‌ సర్టిఫికెట్లను పొందాల్సి వుంటుంది. మార్చి 8 నుంచి ఇది అందుబాటులోకి వస్తుంది. పిసిఆర్‌ సర్టిఫికెట్‌ లేని ప్రయాణీకులకు కువైట్‌లోకి ప్రవేశం వుండదని అధికారులు స్పష్టం చేశారు.

--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com