'APNRTS' ఆధ్వర్యంలో నైపుణ్య శిక్షణ
- March 04, 2020
ఏ.పి:ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సంస్థ ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ (ఏపీఎన్ఆర్టిఎస్) ఆసక్తి కలిగిన అభ్యర్థులకు నైపుణ్య శిక్షణ అందించి, ఉద్యోగావకాశాలు కలిపిస్తోంది. ఇప్పటికే రెండు బ్యాచుల అభ్యర్థులకు శిక్షణ ఇచ్చి, 25 మందికి విదేశాల్లో ఉద్యోగాలు కల్పించింది. ఇప్పుడు మూడవ బ్యాచ్ అభ్యర్థులకు శిక్షణ ప్రారంభించేందుకు ఆసక్తి కలిగిన అభ్యర్థులను ఆహ్వానిస్తోంది ఏపీఎన్ఆర్టిఎస్. గుంటూరు మరియు రాజంపేట అంతర్జాతీయ నైపుణ్యాభివృద్ధి కేంద్రాల్లో ఉచితంగా “ఇండస్ట్రియల్ ఎలక్ట్రీషియన్” శిక్షణ ఇచ్చి గల్ఫ్ దేశాలలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తోంది ఏపీఎన్ఆర్టిఎస్. రాష్ట్రంలోని నిరుద్యోగ యువత జీవన ప్రమాణాలు మెరుగుపరిచే విధముగా అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన శిక్షణతో పాటు, ఉచిత ఆహారం, వసతి సౌకర్యాలు కల్పిస్తోంది. శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు అంతర్జాతీయ స్థాయి లో సర్టిఫికేట్ జారీ చేయబడుతుంది. శిక్షణ పొందాలనుకునే అభ్యర్థులు ఎస్.ఎస్.సి, ఐటిఐ, ఇంటర్ లేదా ఏదైనా డిగ్రీ కలిగి ఉండవలెను. ఔత్సాహిక నిరుద్యోగ యువతకు ఇది మంచి అవకాశం...ఉద్యోగాల పేరుతో దళారీల మాటలు నమ్మి మోసపోకండి. ప్రభుత్వం అందించే ఇటువంటి శిక్షణా కేంద్రాలు నుండి పొందే సర్టిఫికేట్ ఎంతగానో ఉపయోగపడుతుందని ఏపీఎన్ఆర్టిఎస్ అధికారులు తెలిపారు. నాలుగు నెలల శిక్షణ మరియు అడ్మిషన్స్ కొరకు అభ్యర్థులు “వావిలాల సంస్థ”, 12/3 అరండల్ పేట, గుంటూరు, ఫోన్: 8500727678 మరియు “YSR ప్రవాసాంధ్ర సేవా కేంద్రం” బొయిన్ పల్లి, రాజంపేట, ఫోన్: 8500127678 నందు సంప్రదించండి. మరింత సమాచారం కొరకు ఏపిఎన్ఆర్టిఎస్ హెల్ప్ లైన్ నెంబర్లు 0863 2340678, 8500027678 ను సంప్రదించండి.
తాజా వార్తలు
- ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ అలర్ట్
- భోగాపురానికి ప్రధాని మోదీ.. పూర్తి షెడ్యూల్ ఇదే !!
- జీవన నాణ్యతలో ఆసియాలో ఒమన్కు తొలి స్థానం..!!
- ఖతార్లో ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై చర్యలు..!!
- దక్షిణ అల్ బతీనాహ్ గవర్నరేట్లో భారీ వర్షాలు..!!
- ఇరాన్పై సైనిక చర్యల్లో భాగస్వామ్యం.. WSJ కథనాన్ని ఖండించిన కువైట్..!!
- దుబాయ్ డేట్ ఫెస్టివల్ లో పాల్గొనేవారికి Dh1 మిలియన్ గ్రాంట్..షేక్ హమ్దాన్ ఆదేశాలు..!!
- సౌదీ మరో ఘనత..అంతర్జాతీయ ఐఎస్ఓ కమిటీకి నేతృత్వం..!!
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..







