దుబాయ్:రోడ్ యాక్సిడెంట్ 29 ఏళ్ల NRI మృతి
- March 07, 2020దుబాయ్ లో 29 ఏళ్ల ఎన్ఆర్ఐ రోడ్డు ప్రమాదం మృతి చెందాడు. శుక్రవారం ఉదయం తాము ప్రయాణిస్తున్న మినివ్యాన్ ను ఓ ట్రక్కు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతుడు ముహమ్మద్ సవాద్ సొంతూరు కేరళాలోని మళప్పురన్ జిల్లా. ప్రమాదం జరిగిన సమయంలో ముహమ్మద్ సవాద్ ప్యాసింజర్ సీట్లో కూర్చున్నాడని..యాక్సిడెంట్ జరగ్గానే స్పాట్ లోనే అతను మరణించాడని సోషల్ వర్కర్ నసీర్ వతనపల్లి తెలిపారు. ఈ ప్రమాదంలో డ్రైవర్ మొహ్మద్ అబ్దుల్ కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం అతను దుబాయ్ లోని ఎమిరాతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. సవాద్, అబ్దుల్ ఇద్దరు అబుదాబిలోని రెస్టారెంట్లకు ఫిష్ సప్లై చేస్తుంటారు. ప్రమాదం జరిగిన సమయంలో కూడా ఓ రెస్టారెంట్ కు ఫిష్ సప్లై చేసి దుబాయ్ నుంచి అబుదాబికి తిరిగి వస్తున్నారని నసీర్ వెల్లడించారు. బాధితుల ఇద్దరి కుటుంబాలు యూఏఈలోనే ఉంటున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- ఐపీఎల్ టికెట్ల అమ్మకాల్లో భారీ అక్రమాలు..
- ముగిసిన రెండో విడత ఎన్నికల ప్రచారం..
- ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ
- ప్రధాని మోడీ ప్రసంగం పై వచ్చిన ఫిర్యాదులను పరిశీలిస్తున్నాం: ఈసీ
- కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం, 8 కార్లు ఢీ..
- భారతీయుల కోసం కొత్త ‘భా’ షూ సైజింగ్ సిస్టమ్..
- యూఏఈలో పెరగనున్న వాహన, ప్రాపర్టీ బీమా రేట్లు..!
- అక్రమ ప్రాక్టీస్..ప్రవాస మహిళా హెల్త్ ప్రాక్టీషనర్ అరెస్ట్
- వాతావరణ ప్రమాదాలపై కీలక కాన్ఫరెన్స్
- 'మాకు ఇప్పుడు ఇల్లు లేదు'.. దుబాయ్ టవర్ నివాసితులు ఆవేదన