ఇరాన్లో కరోనావైరస్ కారణంగా రాజకీయ నాయకుడు మృతి
- March 07, 2020ఇరాన్:ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా గురించి తెలిసిందే. ఇప్పటికే మూడు వేల మందికి పైగా ఈ వైరస్ మహమ్మారినపడి ప్రాణాలు వదిలారు. ఈ కరోనాను కనుగొన్న వైద్యుడిని కూడా ఇది బలిగొంది. అయితే ఇప్పటి వరకు ఈ వైరస్ బారిన పడి సామాన్యులే మృతిచెందగా.. తాజాగా ఇది ఉన్నత స్థానంలో ఉన్న ప్రభుత్వాధికారులను కూడా వదల్లేదు. ఇరాన్ దేశానికి చెందిన విదేశాంగ మంత్రి సలహాదారు హుస్సేన్ షేఖొలెస్లాం కరోనా ఎపెక్ట్తో గురువారం రాత్రి మరణించినట్లు ఆ దేశ అధికారులు ధృవీకరించారు. ఇప్పటికే ఇరాన్కు చెందిన పలువురు రాజకీయ నేతలకి ఈ వైరస్ సోకడంతో.. వారంతా స్వచ్ఛందంగా నిర్భందంలోకి వెళ్లిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్
- ఖలిస్థానీ ఉగ్రవాది హత్య కేసు.. ముగ్గురు భారతీయులు అరెస్టు
- బంగారం స్వచ్ఛతను తనిఖీ చేసే ఐదు సులభమైన మార్గాలు
- పలు రాష్ట్రాలకు వర్ష సూచన
- ఎన్నారై తెలుగుదేశం కువైట్ ఆధ్వర్యంలో కువైట్లో విస్తృత ప్రచారం
- అబుదాబి బుక్ ఫెయిర్.. ఉచిత ప్రవేశం ఇలా పొందండి
- యుద్ధ విమానం నడిపిన కృత్రిమ మేధ
- యూఏఈలో 3శాతం పెరిగిన ప్రమాద మరణాలు
- సకాలంలో జీతాలు చెల్లించని కంపెనీలకు తీవ్ర హెచ్చరిక