ఇరాన్‌లో కరోనావైరస్ కారణంగా రాజకీయ నాయకుడు మృతి

- March 07, 2020 , by Maagulf
ఇరాన్‌లో కరోనావైరస్ కారణంగా రాజకీయ నాయకుడు మృతి

ఇరాన్:ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా గురించి తెలిసిందే. ఇప్పటికే మూడు వేల మందికి పైగా ఈ వైరస్ మహమ్మారినపడి ప్రాణాలు వదిలారు. ఈ కరోనాను కనుగొన్న వైద్యుడిని కూడా ఇది బలిగొంది. అయితే ఇప్పటి వరకు ఈ వైరస్ బారిన పడి సామాన్యులే మృతిచెందగా.. తాజాగా ఇది ఉన్నత స్థానంలో ఉన్న ప్రభుత్వాధికారులను కూడా వదల్లేదు. ఇరాన్ దేశానికి చెందిన విదేశాంగ మంత్రి సలహాదారు హుస్సేన్ షేఖొలెస్లాం కరోనా ఎపెక్ట్‌తో గురువారం రాత్రి మరణించినట్లు ఆ దేశ అధికారులు ధృవీకరించారు. ఇప్పటికే ఇరాన్‌కు చెందిన పలువురు రాజకీయ నేతలకి ఈ వైరస్ సోకడంతో.. వారంతా స్వచ్ఛందంగా నిర్భందంలోకి వెళ్లిన విషయం తెలిసిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com