కరోనా వైరస్: దుబాయ్ ఒయాసిస్ మాల్ మూసివేయలేదు
- March 12, 2020దుబాయ్లోని ప్రముఖ షాపింగ్ మాల్ అయిన ఒయాసిస్ మాల్ కరోనా వైరస్ కారణంగా మూసివేతకు గురయ్యిందంటూ జరుగుతున్న ప్రచారంపై సదరు మాల్ యాజమాన్యం స్పందించింది. ఇవి ఫాల్స్ రూమర్స్ అని కొట్టి పారేసింది. షాపింగ్ మాల్ యెదుట అంబులెన్స్ ఆగడం, అందులోంచి పారామెడిక్స్ మాల్లోకి వెళ్ళడం.. ఇదంతా ఓ వీడియోలో చిత్రీకరించబడింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అల్ కౌజ్ ప్రాంతంలో మెడికల్ ఎమర్జన్సీ ఏర్పడితే, ఓ వ్యక్తి ఒయాసిస్ మాల్ని ల్యాండ్ మార్క్గా రిఫర్ చేశారు. దాంతో, పారామెడిక్స్ తమ డ్యూటీ తాము చేశారు. మాల్లోకి పొరపాటున పారామెడిక్స్ వచ్చారు. అంతే తప్ప, మాల్కి ఈ ఘటనకీ ఎలాంటి సంబంధం లేదని సంస్థ యాజమాన్యం పేర్కొంది. ఒయాసిస్ మాల్లో ఇప్పటిదాకా ఎలాంటి కరోనా వైరస్ కేసులు నమోదు కాలేదనీ, కరోనా తీవ్రత నేపథ్యంలో అన్ని భద్రతా చర్యలూ తీసుకుంటున్నామని సంస్థ ప్రతినిథులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!
- సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- దుబాయ్లో AI క్యాంపస్ మొదటి దశ ప్రారంభం
- కోల్డ్ కాలింగ్ కోసం రూల్స్, ఫైన్ సెట్
- అంతర్జాతీయ కాల్స్ పట్ల జాగ్రత్త..అథారిటీ హెచ్చరిక
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..