ప్రపంచ వ్యాప్తంగా అక్టోబర్ 23న విడుదలవుతున్న‘కె.జి.యఫ్ చాప్టర్ 2’
- March 13, 2020
సినిమా చరిత్రలో హిట్స్, సూపర్హిట్స్, బ్లాక్బస్టర్ చిత్రాలు వస్తుంటాయి. కానీ ట్రె్ండ సెట్టింగ్ మూవీస్ మాత్రం అరుదుగానే వస్తుంటాయి. అలాంటి అరుదైన ట్రెండ్ సెట్టింగ్ మూవీస్లో ‘కె.జి.యఫ్' ఒకటి. రెండు భాగాలుగా విడుదలవుతున్న ఈ చిత్రంలో తొలి భాగం ‘కె.జి.యఫ్ చాప్టర్ 1’ కన్నడ చిత్రసీమలో ‘కె.జి.యఫ్’ ట్రెండ్ సెట్టింగ్ మూవీగా నిలవడమే కాకుండా పాన్ ఇండియా చిత్రంగా కన్నడ, తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో సెన్సేషనల్ హిట్ అయ్యి రికార్డ్ కలెక్షన్స్ను సాధించింది. వసూళ్లలోనే కాకుండా అవార్డుల్లోనూ ‘కె.జి.యఫ్ చాప్టర్ 1’ విజువల్ ఎఫెక్ట్, స్టంట్స్ విభాగాల్లో జాతీయ అవార్డులను కూడా సొంతం చేసుకుంది.
అటు అభిమానులు, ఇటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలను క్రియేట్ చేసిన ‘కె.జి.యఫ్ చాప్టర్ 1’కి కొనసాగింపుగా ‘కె.జి.యఫ్ చాప్టర్ 2‘ రూపొందుతోన్న సంగతి తెలిసిందే. కైకాల సత్యనారాయణ సమర్పణలో హోంబలే ఫిలిమ్స్ బ్యానర్పై ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో విజయ్ కిరగందూర్ భారీ బడ్జెట్తో అంచనాలకు ధీటుగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ వారాహి చలన చిత్రం అధినేత సాయికొర్రపాటి ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నారు. ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్కి ప్రేక్షకులు, అభిమానుల నుండి అమేజింగ్ రెస్పాన్స్ వచ్చింది. బాలీవు్డ స్టార్ యాక్టర్ సంజయ్ దత్ ఈ చిత్రంలో అధీర అనే పవర్ఫుల్ పాత్రలో నటిస్తుండగా బాలీవుడ్ నటి రవీనాటాండన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇటీవల యష్, సంజయ్ దత్, రవీనాటాండన్ సహా ఇతర తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. దీంతో మేజర్ షెడ్యూల్ పూర్తయ్యింది. అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసి ఈ ఫాన్ ఇండియా చిత్రాన్ని దసరా సందర్భంగా అక్టోబర్ 23న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నారు.
రాకీ భాయ్గా యష్ రాకింగ్ పెర్ఫామెన్స్ చేయనున్న ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటిస్తుంది. ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతం .. భువన్ గౌడ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







