ఐపీఎల్ వాయిదా..
- March 13, 2020
ముంబై: ఐపీఎల్ ప్రియులకు బ్యాడ్ న్యూస్. ఈ నెల 29 నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ మ్యాచ్లు వాయిదా పడ్డాయి. వచ్చే నెల 15 నుంచి ప్రారంభం కానున్నట్టు బీసీసీఐ ప్రకటించింది. కరోనా ఎఫెక్ట్తో బీసీసీఐ తాజా నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ నేపథ్యంలో ప్రేక్షకులు లేకుండానే మ్యాచ్లు నిర్వహించాలని కేంద్ర క్రీడాశాఖ సూచించడంతో.. ఐపీఎల్ ఫ్రాంచైజీలు ఆలోచనలో పడ్డాయి. మరోవైపు మ్యాచ్ల నిర్వహణకు హర్యానా, ఢిల్లీ, ముంబై, కర్ణాటక నిరాకరించాయి. దీంతో రెండు వారాలు ఐపీఎల్ను వాయిదా వేయాలంటూ బీసీసీఐని ఫ్రాంచైజీలు కోరాయి. ఫ్రాంచైజీల అభ్యర్థన మేరకు బీసీసీఐ తాజా నిర్ణయం తీసుకుంది.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







