బహ్రెయిన్:లోన్ ఈఎంఐలు ఆలస్యమైనా ఫర్వాలేదు..
- March 14, 2020
బహ్రెయిన్:కరోనా వైరస్ బాధితులకు నేషనల్ బ్యాంక్ ఆఫ్ బహ్రెయిన్ ఊరటనిచ్చే ప్రకటన విడుదల చేసింది. తమ కస్టమర్లు లోన్స్ ఇన్స్ స్టాల్మెంట్ చెల్లింపుల్లో ఆలస్యమైనా ఫర్వాలేదని ప్రకటించింది. ప్రాణాంతక కరోనా వైరస్ ప్రపంచ దేశాల ఆర్ధిక వ్యవస్థపై ప్రభావం చపుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తమ వినియోగదారుల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని లోన్ల ఈఎంఐ చెల్లింపుల్లో మినహాయింపు ఇచ్చినట్లు ప్రకటించింది. తమకు తమ కస్టమర్లు(కంపెనీలు లేదా వ్యక్తిగత ఖాతాదారులు) సోసైటీ సేఫ్టీ ఫస్ట్ ప్రియారిటీ అని ఎన్బీబీ ప్రకటించింది. కరోనా ప్రభావం ఆర్ధిక వ్యవస్థపై చూపుతున్న ప్రభావం తమకు తెలుసని, ఈ డిఫికల్ట్ పరిస్థితుల్లో కస్టమర్స్ ఎదుర్కొంటున్న ఆర్ధిక సవాళ్లను తాము అర్ధం చేసుకోగలమని తెలిపింది. ఈ పరిస్థితుల్లో వారికి మద్దతుగా నిలబడాలని నిర్ణయించినట్లు వెల్లడించింది. అలాగే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ బహ్రెయిన సూచనలను కూడా పాటిస్తూ లోన్ల వాయిదాలను డిడక్ట్ చేసుకోవటాన్ని పోస్ట్ పోన్ చేస్తున్నట్లు బ్యాంక్ వర్గాలు స్పష్టం చేశాయి.
--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!
- యూఏఈలో పిల్లల స్కూల్ లంచ్..నెలకు Dh800 వరకు ఖర్చు..!!
- విద్యా సంస్థల లైసెన్సులు, ఫీజులపై తనిఖీలు చేయాలి..!!







