కరోనా ఎఫెక్ట్: పొరుగుదేశాల సరిహద్దులు మూసేస్తున్న భారత్
- March 15, 2020
కరోనా విస్తరించకుండా అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటుంది కేంద్ర ప్రభుత్వం.. ఇప్పటికే కరోనాను జాతీయ విపత్తుగా ప్రకటించిన నరేంద్ర మోడీ సర్కార్... ఇప్పుడు ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా పొరుగుదేశాల సరిహద్దులు కూడా మూసివేయాలని నిర్ణయించింది. భారత్-బంగ్లాదేశ్, భారత్-నేపాల్, భారత్-భూటాన్, భారత్-మయన్మార్ ఇలా అన్ని సరిహద్దుల వెంట రాకపోకలపై నిషేదాజ్ఞలు విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్ర హోంమంత్రిత్వశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు ఇవాళ అర్థరాత్రి 12 గంటల నుంచి అమల్లోకి రానున్నాయి. ఒక, ఒక రోజు ఆలస్యంగా.. అంటే రేపటి అర్ధరాత్రి నుంచి భారత్-పాకిస్థాన్ సరిహద్దును కూడా మూసివేయనున్నారు. ఇక, బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్, మయన్మార్ దేశాల నుంచి వచ్చేవారిని సరిహద్దుల్లో కరోనా వైరస్ పరీక్షలు తప్పనిసరి చేస్తారు. అధికారిక వీసాలు కలిగిన రాయబారులు, యూఎన్ సిబ్బందిని మాత్రం భారత్-పాకిస్థాన్ సరిహద్దులోని అట్టారి క్రాసింగ్ పాయింట్ వద్ద అనుమతిస్తారు. అదైనా వీరిని పూర్తిస్థాయిలో స్కానింగ్ చేసిన తర్వాత మాత్రమే అనుమతి ఉంటుంది.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు