కరోనా ఎఫెక్ట్: పొరుగుదేశాల సరిహద్దులు మూసేస్తున్న భారత్
- March 15, 2020
కరోనా విస్తరించకుండా అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటుంది కేంద్ర ప్రభుత్వం.. ఇప్పటికే కరోనాను జాతీయ విపత్తుగా ప్రకటించిన నరేంద్ర మోడీ సర్కార్... ఇప్పుడు ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా పొరుగుదేశాల సరిహద్దులు కూడా మూసివేయాలని నిర్ణయించింది. భారత్-బంగ్లాదేశ్, భారత్-నేపాల్, భారత్-భూటాన్, భారత్-మయన్మార్ ఇలా అన్ని సరిహద్దుల వెంట రాకపోకలపై నిషేదాజ్ఞలు విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్ర హోంమంత్రిత్వశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు ఇవాళ అర్థరాత్రి 12 గంటల నుంచి అమల్లోకి రానున్నాయి. ఒక, ఒక రోజు ఆలస్యంగా.. అంటే రేపటి అర్ధరాత్రి నుంచి భారత్-పాకిస్థాన్ సరిహద్దును కూడా మూసివేయనున్నారు. ఇక, బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్, మయన్మార్ దేశాల నుంచి వచ్చేవారిని సరిహద్దుల్లో కరోనా వైరస్ పరీక్షలు తప్పనిసరి చేస్తారు. అధికారిక వీసాలు కలిగిన రాయబారులు, యూఎన్ సిబ్బందిని మాత్రం భారత్-పాకిస్థాన్ సరిహద్దులోని అట్టారి క్రాసింగ్ పాయింట్ వద్ద అనుమతిస్తారు. అదైనా వీరిని పూర్తిస్థాయిలో స్కానింగ్ చేసిన తర్వాత మాత్రమే అనుమతి ఉంటుంది.
తాజా వార్తలు
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!







