కరోనా ఎఫెక్ట్: పొరుగుదేశాల సరిహద్దులు మూసేస్తున్న భారత్
- March 15, 2020కరోనా విస్తరించకుండా అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటుంది కేంద్ర ప్రభుత్వం.. ఇప్పటికే కరోనాను జాతీయ విపత్తుగా ప్రకటించిన నరేంద్ర మోడీ సర్కార్... ఇప్పుడు ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా పొరుగుదేశాల సరిహద్దులు కూడా మూసివేయాలని నిర్ణయించింది. భారత్-బంగ్లాదేశ్, భారత్-నేపాల్, భారత్-భూటాన్, భారత్-మయన్మార్ ఇలా అన్ని సరిహద్దుల వెంట రాకపోకలపై నిషేదాజ్ఞలు విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్ర హోంమంత్రిత్వశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు ఇవాళ అర్థరాత్రి 12 గంటల నుంచి అమల్లోకి రానున్నాయి. ఒక, ఒక రోజు ఆలస్యంగా.. అంటే రేపటి అర్ధరాత్రి నుంచి భారత్-పాకిస్థాన్ సరిహద్దును కూడా మూసివేయనున్నారు. ఇక, బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్, మయన్మార్ దేశాల నుంచి వచ్చేవారిని సరిహద్దుల్లో కరోనా వైరస్ పరీక్షలు తప్పనిసరి చేస్తారు. అధికారిక వీసాలు కలిగిన రాయబారులు, యూఎన్ సిబ్బందిని మాత్రం భారత్-పాకిస్థాన్ సరిహద్దులోని అట్టారి క్రాసింగ్ పాయింట్ వద్ద అనుమతిస్తారు. అదైనా వీరిని పూర్తిస్థాయిలో స్కానింగ్ చేసిన తర్వాత మాత్రమే అనుమతి ఉంటుంది.
తాజా వార్తలు
- ఇజ్రాయెల్, ఇరాన్ వెళ్లే భారతీయులకు విదేశాంగ సూచన
- టోఫెల్ ఇండియా ఛాంపియన్షిప్ను ప్రారంభించిన ఈటిఎస్
- వాట్సప్ లో కొత్త ఫీచర్..
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు