శంషాబాద్‌ విమానాశ్రయంని సందర్శించిన కమీషనర్ సజ్జనార్

- March 15, 2020 , by Maagulf
శంషాబాద్‌ విమానాశ్రయంని సందర్శించిన కమీషనర్ సజ్జనార్

శంషాబాద్:కోవిడ్‌-19 వ్యాధి, కరోనా వైరస్‌ వ్యాప్తిపై సోషల్‌ మీడియాలో అసత్యాలు ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ అన్నారు. శంషాబాద్‌ విమానాశ్రయంలో స్క్రీనింగ్‌ పరికరాలను సైబరాబాద్‌ సీపీ నేడు పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఇతర దేశాల నుంచి వచ్చిన వారికి మాత్రమే కరోనా వైరస్‌ లక్షణాలు కనిపిస్తున్నాయన్నారు. ఎయిర్‌పోర్టులో విధులు నిర్వహించే వైద్య సిబ్బందికి ప్రత్యేక డ్రెస్‌, శానిటైజర్‌ అందుబాటులో ఉంచుతున్నామన్నారు. వైద్య పరీక్షల నిమిత్తం ఎయిర్‌పోర్టులో 200 మంది డాక్టర్లు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com