మనామ : కరోనాపై పోరాటానికి పేర్లు నమోదు చేసుకున్న 30,000 వాలంటీర్లు
- March 22, 2020
కరోనా వైరస్ పై పోరాడేందుకు ఏర్పాటు చేసిన జాతీయ టాస్క్ ఫోర్స్ తమతో కలిసి పని చేయటానికి 30 వేల మంది వాలంటీర్లు పేర్లు నమోదు చేసుకున్నారని వెల్లడించింది. వాలంటీర్ల పేర్ల నమోదు ఈ నెల 15 నుంచి చేపట్టామని..ఈ వారం రోజుల్లోనే దాదాపు 30 వేల మంది కరోనాపై పోరాటానికి ముందుకు రావటం సంతోషించదగ్గ పరిణామం అని పేర్కొంది. ఇందులో మొదటగా సంప్రదించిన వారు మెడికల్ నేపథ్యం ఉన్న వారు, ఫీల్డ్ వర్క్, హెల్త్ సర్వీసులు అందించిన నేపథ్యం ఉన్నవాళ్లే కావటం విశేషం. కరోనాపై చిత్తశుద్ధితో సేవలు అందించాల్సిన ప్రస్తుత తరుణంలో ఇంతమంది బాధ్యతగల పౌరులు తమ సామాజిక బాధ్యతగా సంఘీభావం చాటుకున్నారని టాస్క్ ఫోర్స్ నిర్వాహకులు ప్రశంసించారు.
తాజా వార్తలు
- హెలికాప్టర్ ప్రమాదంలో ప్రముఖ సింగర్ అలివర్ ట్రీ గాస్పి దుర్మరణం
- 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా వినియోగంపై బ్రిటన్ నిషేధం
- అమెరికా, ఇరాన్ శాంతి ఒప్పందంపై ప్రపంచ దేశాలు హర్షం
- దేశ సమగ్రత కోసం ఢిల్లీలో 'సేన ప్రస్థానం' కార్యక్రమం
- అమెరికా, ఇరాన్ దేశాల మధ్య ఒప్పందం..త్వరలో సంతకాలు
- ప్రతి పోలీస్ స్టేషన్కు ‘పోలీస్ మెంటార్’: సీపీ సజ్జనార్
- సౌదీలో స్పోర్ట్స్ సెంటర్స్ కు కొత్త నిబంధనలు..పెర్ఫర్మాన్స్ డ్రగ్స్ పై నిషేధం..!!
- ఖైదీలు తయారు చేసిన ఉత్పత్తుల విక్రయానికి 'Sooum' యాప్..!!
- ఇంటర్పోల్ వెతుకున్న బంగ్లాదేశ్ మాజీ పోలీస్ బాస్ యూఏఈలో అరెస్ట్..!!
- కువైట్లో వాహనం బోల్తా.. అగ్నిప్రమాదానికి గురై ఇద్దరు మృతి..!!









