మనామ : కరోనాపై పోరాటానికి పేర్లు నమోదు చేసుకున్న 30,000 వాలంటీర్లు

- March 22, 2020 , by Maagulf
మనామ : కరోనాపై పోరాటానికి పేర్లు నమోదు చేసుకున్న 30,000 వాలంటీర్లు

కరోనా వైరస్ పై పోరాడేందుకు ఏర్పాటు చేసిన జాతీయ టాస్క్ ఫోర్స్ తమతో కలిసి పని చేయటానికి 30 వేల మంది వాలంటీర్లు పేర్లు నమోదు చేసుకున్నారని వెల్లడించింది. వాలంటీర్ల పేర్ల నమోదు ఈ నెల 15 నుంచి చేపట్టామని..ఈ వారం రోజుల్లోనే దాదాపు 30 వేల మంది కరోనాపై పోరాటానికి ముందుకు రావటం సంతోషించదగ్గ పరిణామం అని పేర్కొంది. ఇందులో మొదటగా సంప్రదించిన వారు మెడికల్ నేపథ్యం ఉన్న వారు, ఫీల్డ్ వర్క్, హెల్త్ సర్వీసులు అందించిన నేపథ్యం ఉన్నవాళ్లే కావటం విశేషం. కరోనాపై చిత్తశుద్ధితో సేవలు అందించాల్సిన ప్రస్తుత తరుణంలో ఇంతమంది బాధ్యతగల పౌరులు తమ సామాజిక బాధ్యతగా సంఘీభావం చాటుకున్నారని టాస్క్ ఫోర్స్ నిర్వాహకులు ప్రశంసించారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com