ప్రభుత్వ ఉద్యోగులను 'ఇంటి నుండి పని' చేయమని కోరిన షార్జా ప్రభుత్వం

- March 22, 2020 , by Maagulf
ప్రభుత్వ ఉద్యోగులను 'ఇంటి నుండి పని' చేయమని కోరిన షార్జా ప్రభుత్వం

షార్జా:షార్జా లో కరోనావైరస్ వ్యాప్తిని అరికట్టడానికి ముందుజాగ్రత్త చర్యగా, ప్రభుత్వ ఉద్యోగులందరూ ఇంటి నుండి పని చేయవలసిందిగా షార్జా ప్రభుత్వం కోరింది.షార్జా న్యూస్ అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఒక పోస్ట్ ప్రకారం, కార్యాలయంలో హాజరు కావాల్సిన ఉద్యోగులు తప్ప, మిగతా ఉద్యోగులందరూ ఇంటి నుండి పని చేయాల్సి ఉంటుందని  తారెక్ బిన్ ఖాదెం(హ్యూమన్ రిసోర్సెస్ హెడ్) చెప్పారు.

షిఫ్టులో కార్యాలయం నుండి పనిచేసే ఉద్యోగులు వారిలో 50 శాతం కంటే తక్కువ ఉండరని ఆయన అన్నారు.అదనంగా, పని నిలిపివేయబడిన వివిధ విభాగాలలో పనిచేసే ఉద్యోగులందరికీ పెయిడ్ సెలవు లభిస్తుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com