కరోనావైరస్: యూఏఈ: ప్రయాణీకుల విమానాలు రద్దు..మాల్స్ మూసివేత మరియు స్టే-హోమ్ ఆర్డర్లు జారీ
- March 23, 2020
యూఏఈ: కొరోనా మహమ్మారి ఎన్నో ప్రాణాలను బలిగొంటున్న విషయం తెలిసిందే. మరి దీన్ని నియంత్రించే క్రమంలో దేశాలన్నీ కూడా 'Stay at Home' (ఇంటి వద్దనే ఉండండి) అని అంటున్నాయి. తాజాగా యూఏఈ కూడా ప్రజలను తప్పనిసరైతే తప్పించి ఇంటి వద్దనే ఉందామంటూ పిలుపునిచ్చింది.
రానున్న 48 గంటల్లో అన్ని ప్యాసింజర్ విమానాల రాకపోకలను నిలిపివేయనుంది. కార్గో మరియు అత్యవసర తరలింపు విమానాలు కొనసాగుతాయని సివిల్ ఏవియేషన్ అథారిటీ తెలిపింది. మరియు మాల్స్ మూతబడనున్నాయి. సోమవారం తెల్లవారుజామున తీసుకున్న ఈ నిర్ణయం, కోవిడ్ -19 కి కారణమయ్యే వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు దోహదపడుతుందని తెలిపిన అధికారులు. ఈ ఆంక్షలు రెండు వారాల పాటు ఉంటాయనీ, అవసరమైతే పొడిగించబడతాయి అని కూడా ధృవీకరించిన అధికారులు.
మాల్స్ మూతబడనున్నాయి కానీ సూపర్మార్కెట్లు, ఫార్మసీలు మరియు చేపలు, మాంసం మరియు కూరగాయల మార్కెట్లకు మినహాయింపు ఉంటుంది. హోటళ్లు కూడా మూతబడనున్నాయి కానీ హోమ్ డెలివరీ లు లభ్యమవుతాయి అని వివరణ ఇచ్చింది ప్రభుత్వం.
ప్రజలు రద్దీగా ఉండే ప్రదేశాలకు వెళ్లవద్దని, పార్టీలు, కుటుంబ సమావేశాలు పరిమితం చేయాలనీ, ప్రజలు తమ సొంత వాహనాలను ఉపయోగించాలని, అయితే వారిలో ఉన్న వారి సంఖ్యను మూడుకి పరిమితం చేయాలని పేర్కొంది. అత్యవసర పరిస్థితుల్లో తప్ప ఆసుపత్రులను సందర్శించవద్దని ప్రజలను అర్ధించిన అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ మరియు ఎమర్జెన్సీ శాఖ.
తాజా వార్తలు
- సౌదీలో Absherలో 4 కొత్త ఆన్లైన్ సేవలు.. పౌరులు, నివాసితులకు మరింత సులభతరం
- బిట్స్ పిలానీ దుబాయ్ క్యాంపస్లో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- ఒమన్లో ‘షీల్డ్ 31’ సైనిక విన్యాసం.. ఆఫీసర్ క్యాడెట్ల ప్రత్యక్ష ప్రదర్శన
- మైన్స్ శాఖ కొత్త కార్యాలయం ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర
- తెలంగాణ: ఆదివారమే మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణకు ఛాన్స్..
- అక్టోబర్లోనే స్థానిక ఎన్నికలు..మంత్రి లోకేశ్ కీలక ప్రకటన
- రాస్ అల్ ఖైమాలో నిర్మాణ రసాయనాల తయారీ యూనిట్ను ప్రారంభించిన జేకే సిమెంట్
- ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ హమ్దాన్
- దుబాయ్లో నకిలీ ఫ్రీలాన్స్ వీసాల వ్యవహారం..వ్యక్తి అరెస్ట్
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!







