అమ్మో!..చైనాలో మరో మహమ్మారి, హంటావైరస్ తో ఒకరి మృతి
- March 24, 2020
చైనా దేశంలో పుట్టిన కరోనా వైరస్ తోనే ప్రపంచం మొత్తం గడగడలాడిపోతోంది. కరోనా మహమ్మారికి ఇప్పటి వరకు మందులు కనిపెట్టలేకపోయారు. ప్రపంచ వ్యాప్తంగా 14వేల మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 4లక్షల మంది ఈ వైరస్ సోకి ప్రాణాలతో పోరాడుతున్నారు. మిగిలిన ప్రజలు కూడా ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని తిరుగుతున్నారు. దీనితోనే చస్తుంటో.. మరో వైరస్ మొదలైంది. అది కూడా చైనాలోనే మొదలు కావడం గమనార్హం.
తాజాగా చైనాలో హంటా వైరస్ వెలుగు చూసింది. ఇది ఎలుకల్లో పుట్టుకొచ్చే వైరస్. చైనాలో ఎలుకల్ని తినడం సర్వసాధారణమే. అలా ఎలుకల్ని తినేవారిలోకి ఈ వైరస్ ప్రవేశిస్తుంది. ఇప్పటికే పలువురు హంటా వైరస్ బారిన పడినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ హంటా వైరస్ కారణంగా ఒకరు ప్రాణాలు కోల్పోగా పలువురికి ఈ వైరస్ సోకినట్లు గుర్తించారు.
చైనాలోని షాన్డాంగ్ ప్రావిన్స్లో ఈ వైరస్ పుట్టుకొచ్చినట్టుగా అనుమానిస్తున్నారు. షాన్డాంగ్ ప్రావిన్స్ నుంచి యునాన్ ప్రావిన్స్కు వచ్చిన ఓ వ్యక్తిలో హంటా వైరస్ లక్షణాలు కనిపించాయి. సుమారు 33 మంది ప్రయాణికులతో కూడిన ఒక బస్సు షాన్డాంగ్ ప్రావిన్స్ నుంచి యునాన్ ప్రావిన్స్కు చేరుకుంది. ఈ బస్సులో యునాన్కు చేరుకున్న ఓ ప్రయాణికుడు ఈ వైరస్ బారిన పడ్డాడు. వైరస్ లక్షణాలు వెలుగులోకి వచ్చిన కొన్ని గంటల వ్యవధిలోనే అతను మరణించాడు.
తాజా వార్తలు
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!