అమ్మో!..చైనాలో మరో మహమ్మారి, హంటావైరస్ తో ఒకరి మృతి
- March 24, 2020చైనా దేశంలో పుట్టిన కరోనా వైరస్ తోనే ప్రపంచం మొత్తం గడగడలాడిపోతోంది. కరోనా మహమ్మారికి ఇప్పటి వరకు మందులు కనిపెట్టలేకపోయారు. ప్రపంచ వ్యాప్తంగా 14వేల మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 4లక్షల మంది ఈ వైరస్ సోకి ప్రాణాలతో పోరాడుతున్నారు. మిగిలిన ప్రజలు కూడా ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని తిరుగుతున్నారు. దీనితోనే చస్తుంటో.. మరో వైరస్ మొదలైంది. అది కూడా చైనాలోనే మొదలు కావడం గమనార్హం.
తాజాగా చైనాలో హంటా వైరస్ వెలుగు చూసింది. ఇది ఎలుకల్లో పుట్టుకొచ్చే వైరస్. చైనాలో ఎలుకల్ని తినడం సర్వసాధారణమే. అలా ఎలుకల్ని తినేవారిలోకి ఈ వైరస్ ప్రవేశిస్తుంది. ఇప్పటికే పలువురు హంటా వైరస్ బారిన పడినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ హంటా వైరస్ కారణంగా ఒకరు ప్రాణాలు కోల్పోగా పలువురికి ఈ వైరస్ సోకినట్లు గుర్తించారు.
చైనాలోని షాన్డాంగ్ ప్రావిన్స్లో ఈ వైరస్ పుట్టుకొచ్చినట్టుగా అనుమానిస్తున్నారు. షాన్డాంగ్ ప్రావిన్స్ నుంచి యునాన్ ప్రావిన్స్కు వచ్చిన ఓ వ్యక్తిలో హంటా వైరస్ లక్షణాలు కనిపించాయి. సుమారు 33 మంది ప్రయాణికులతో కూడిన ఒక బస్సు షాన్డాంగ్ ప్రావిన్స్ నుంచి యునాన్ ప్రావిన్స్కు చేరుకుంది. ఈ బస్సులో యునాన్కు చేరుకున్న ఓ ప్రయాణికుడు ఈ వైరస్ బారిన పడ్డాడు. వైరస్ లక్షణాలు వెలుగులోకి వచ్చిన కొన్ని గంటల వ్యవధిలోనే అతను మరణించాడు.
తాజా వార్తలు
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్