రియాద్:యాప్స్ ద్వారా వినియోగదారులు ఆన్ లైన్లో సరుకులు ఆర్డర్ చేసుకోవచ్చు
- March 25, 2020సౌదీ అరేబియాలో వినియోగదారులు ఆన్ లైన్ ద్వారా తమకు కావాల్సిన సరుకులు కొనుక్కోవచ్చని ప్రభుత్వం స్పష్టం చేసింది. అదే సమయంలో కర్ఫ్యూ కారణంగా ఎవరు బయటికి రావొద్దని కూడా హెచ్చరించింది. కరోనా వైరస్ వ్యాప్తి నివారణలో భాగంగా కర్ఫ్యూ విధించిన విషయం తెలిసిందే. అయితే..నిత్యావసరాలు, కిరాణా సామను కోసం ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండేందుకు ఆన్ లైన్ సర్వీసులను మాత్రం కొనసాగిస్తోంది. దేశ పౌరులు, నివాసితులు తమకు కావాల్సిన ఆహారం, ఇతర కిరణా సామాగ్రిని బలగ్ తిజరీ అనే యాప్ ద్వారా బుక్ చేసుకోవచ్చని ప్రభుత్వం ప్రకటించింది. లేదంటే 1900కి డయల్ చేసి కూడా కావాల్సిన వస్తువులను ఆర్డర్ చేసుకోచ్చు. అయితే..వినియోగదారులకు షాపుల నుంచి సరైన వస్తువుల, సరైన పద్దతిలో సరఫరా అయ్యేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కిరాణా వస్తువులు, కూరగాయలు, పండ్లు, చికెన్, మటన్, చేపలు, బేకరి ఐటమ్స్ వరకు ఆన్ లైన్ ఆర్డర్ చేసుకునేందుకు అవకాశం కల్పించారు. అలాగే గ్యాస్ బుకింగ్ కూడా యథావిధిగా అందుబాటులో ఉంటుంది.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ