యూఏఈ:సూపర్ మార్కెట్లు, మెడికల్ షాపులకు అనుమతి
- March 25, 2020
యూఏఈ:ప్రజల అవసరాల నిమిత్తం నిత్యావసర సరుకులు, అత్యవసర మందులు ప్రజలకు అందుబాటులో ఉండేలా యూఏఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి సూపర్ మార్కెట్లు, కిరాణా షాపులు, సహాకార సంఘాలు 24 రోజంతా తెరిచి ఉంచేందుకు అనుమతి ఇచ్చారు. అలాగే మెడికల్ షాపులు 24 గంటలూ ఓపెన్ చేసి ఉండొచ్చని కూడా యూఏఈ ఆరోగ్య పరిరక్షణ, జాతీయ విపత్తుల నిర్వహణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఇదిలాఉంటే..కరోనా వైరస్ కేంద్రమైన చైనా విపత్తు నుంచి తేరుకుంటోంది. ఇప్పటికే వుహాన్ లో బస్సు సర్వీసులను ప్రారంభించారు. బీజింగ్ జూ, చైనా వాల్ సందర్శనకు ప్రజలను అనుమతిస్తున్నారు. అయితే..చైనా కోలుకుంటుంటే యూరప్ దేశాలు మాత్రం అల్లాడిపోతున్నాయి. ఇటలీ, బ్రిటన్, ఫ్రాన్స్ దేశాల్లో పకడ్బందీగా లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. అలాగే భారత్ లో 21 రోజుల లాక్ డౌన్ ప్రకటించారు.
తాజా వార్తలు
- యూఏఈలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న తుంబే ల్యాబ్స్.. అంతర్జాతీయ ISO గుర్తింపు సాధన
- దుబాయ్ పోలీస్–భారత కాన్సులేట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
- కువైట్ లో గోల్డ్ ట్రేడ్ రూల్స్ కఠినతరం..!!
- మనమాలో 'ఇమామ్ హుస్సేన్ మెడికల్ క్లినిక్' ప్రారంభం..!!
- సౌత్ అల్ బతినా సమ్మర్ ఫోరమ్ కార్యకలాపాలు ప్రారంభం..!!
- 1 ట్రిలియన్ దిర్హమ్లను దాటిన దుబాయ్ బ్రాండ్ వాల్యూ..!!
- సముద్రంలో ఇద్దరిని రక్షించిన బోర్డర్ గార్డ్స్..!!
- రిటర్న్ టికెట్లతో దుబాయ్లో ఉచిత హోటల్ బస..ఎమిరేట్స్ ప్రత్యేక సమ్మర్ ఆఫర్
- NEET పునఃపరీక్షలో మొత్తం 30 మంది అరెస్టు
- ఖతార్లో భారీ పేలుడు: 54 మందికి గాయాలు, 18 మంది గల్లంతు







