యూఏఈ:సూపర్ మార్కెట్లు, మెడికల్ షాపులకు అనుమతి
- March 25, 2020యూఏఈ:ప్రజల అవసరాల నిమిత్తం నిత్యావసర సరుకులు, అత్యవసర మందులు ప్రజలకు అందుబాటులో ఉండేలా యూఏఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి సూపర్ మార్కెట్లు, కిరాణా షాపులు, సహాకార సంఘాలు 24 రోజంతా తెరిచి ఉంచేందుకు అనుమతి ఇచ్చారు. అలాగే మెడికల్ షాపులు 24 గంటలూ ఓపెన్ చేసి ఉండొచ్చని కూడా యూఏఈ ఆరోగ్య పరిరక్షణ, జాతీయ విపత్తుల నిర్వహణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఇదిలాఉంటే..కరోనా వైరస్ కేంద్రమైన చైనా విపత్తు నుంచి తేరుకుంటోంది. ఇప్పటికే వుహాన్ లో బస్సు సర్వీసులను ప్రారంభించారు. బీజింగ్ జూ, చైనా వాల్ సందర్శనకు ప్రజలను అనుమతిస్తున్నారు. అయితే..చైనా కోలుకుంటుంటే యూరప్ దేశాలు మాత్రం అల్లాడిపోతున్నాయి. ఇటలీ, బ్రిటన్, ఫ్రాన్స్ దేశాల్లో పకడ్బందీగా లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. అలాగే భారత్ లో 21 రోజుల లాక్ డౌన్ ప్రకటించారు.
తాజా వార్తలు
- ముగిసిన రెండో విడత ఎన్నికల ప్రచారం..
- ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ
- ప్రధాని మోడీ ప్రసంగం పై వచ్చిన ఫిర్యాదులను పరిశీలిస్తున్నాం: ఈసీ
- కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం, 8 కార్లు ఢీ..
- భారతీయుల కోసం కొత్త ‘భా’ షూ సైజింగ్ సిస్టమ్..
- యూఏఈలో పెరగనున్న వాహన, ప్రాపర్టీ బీమా రేట్లు..!
- అక్రమ ప్రాక్టీస్..ప్రవాస మహిళా హెల్త్ ప్రాక్టీషనర్ అరెస్ట్
- వాతావరణ ప్రమాదాలపై కీలక కాన్ఫరెన్స్
- 'మాకు ఇప్పుడు ఇల్లు లేదు'.. దుబాయ్ టవర్ నివాసితులు ఆవేదన
- ఉమ్మడి సహకారం.. ఇండియాతో కువైట్ ఒప్పందం