యూఏఈ:సూపర్ మార్కెట్లు, మెడికల్ షాపులకు అనుమతి
- March 25, 2020యూఏఈ:ప్రజల అవసరాల నిమిత్తం నిత్యావసర సరుకులు, అత్యవసర మందులు ప్రజలకు అందుబాటులో ఉండేలా యూఏఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి సూపర్ మార్కెట్లు, కిరాణా షాపులు, సహాకార సంఘాలు 24 రోజంతా తెరిచి ఉంచేందుకు అనుమతి ఇచ్చారు. అలాగే మెడికల్ షాపులు 24 గంటలూ ఓపెన్ చేసి ఉండొచ్చని కూడా యూఏఈ ఆరోగ్య పరిరక్షణ, జాతీయ విపత్తుల నిర్వహణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఇదిలాఉంటే..కరోనా వైరస్ కేంద్రమైన చైనా విపత్తు నుంచి తేరుకుంటోంది. ఇప్పటికే వుహాన్ లో బస్సు సర్వీసులను ప్రారంభించారు. బీజింగ్ జూ, చైనా వాల్ సందర్శనకు ప్రజలను అనుమతిస్తున్నారు. అయితే..చైనా కోలుకుంటుంటే యూరప్ దేశాలు మాత్రం అల్లాడిపోతున్నాయి. ఇటలీ, బ్రిటన్, ఫ్రాన్స్ దేశాల్లో పకడ్బందీగా లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. అలాగే భారత్ లో 21 రోజుల లాక్ డౌన్ ప్రకటించారు.
తాజా వార్తలు
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్..
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్లో విస్తరిస్తున్న తుఫాన్..?