రియాద్:యాప్స్ ద్వారా వినియోగదారులు ఆన్ లైన్లో సరుకులు ఆర్డర్ చేసుకోవచ్చు
- March 25, 2020
సౌదీ అరేబియాలో వినియోగదారులు ఆన్ లైన్ ద్వారా తమకు కావాల్సిన సరుకులు కొనుక్కోవచ్చని ప్రభుత్వం స్పష్టం చేసింది. అదే సమయంలో కర్ఫ్యూ కారణంగా ఎవరు బయటికి రావొద్దని కూడా హెచ్చరించింది. కరోనా వైరస్ వ్యాప్తి నివారణలో భాగంగా కర్ఫ్యూ విధించిన విషయం తెలిసిందే. అయితే..నిత్యావసరాలు, కిరాణా సామను కోసం ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండేందుకు ఆన్ లైన్ సర్వీసులను మాత్రం కొనసాగిస్తోంది. దేశ పౌరులు, నివాసితులు తమకు కావాల్సిన ఆహారం, ఇతర కిరణా సామాగ్రిని బలగ్ తిజరీ అనే యాప్ ద్వారా బుక్ చేసుకోవచ్చని ప్రభుత్వం ప్రకటించింది. లేదంటే 1900కి డయల్ చేసి కూడా కావాల్సిన వస్తువులను ఆర్డర్ చేసుకోచ్చు. అయితే..వినియోగదారులకు షాపుల నుంచి సరైన వస్తువుల, సరైన పద్దతిలో సరఫరా అయ్యేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కిరాణా వస్తువులు, కూరగాయలు, పండ్లు, చికెన్, మటన్, చేపలు, బేకరి ఐటమ్స్ వరకు ఆన్ లైన్ ఆర్డర్ చేసుకునేందుకు అవకాశం కల్పించారు. అలాగే గ్యాస్ బుకింగ్ కూడా యథావిధిగా అందుబాటులో ఉంటుంది.
తాజా వార్తలు
- సౌత్ అల్ బతినా సమ్మర్ ఫోరమ్ కార్యకలాపాలు ప్రారంభం..!!
- 1 ట్రిలియన్ దిర్హమ్లను దాటిన దుబాయ్ బ్రాండ్ వాల్యూ..!!
- సముద్రంలో ఇద్దరిని రక్షించిన బోర్డర్ గార్డ్స్..!!
- రిటర్న్ టికెట్లతో దుబాయ్లో ఉచిత హోటల్ బస..ఎమిరేట్స్ ప్రత్యేక సమ్మర్ ఆఫర్
- NEET పునఃపరీక్షలో మొత్తం 30 మంది అరెస్టు
- ఖతార్లో భారీ పేలుడు: 54 మందికి గాయాలు, 18 మంది గల్లంతు
- హర్మూజ్ జలసంధి మూసివేతతో భారీగా పెరిగిన చమురు ధరలు
- రూ.50 లక్షలకోసం భర్త కిడ్నాప్ డ్రామా!
- యూఏఈలో మూడు రోజులపాటు రెయిన్ అలెర్ట్..!!
- సాయికృష్ణ మిస్సింగ్ కేసు..నేడు కోర్టుకు ఆధారాలు







