రియాద్:యాప్స్ ద్వారా వినియోగదారులు ఆన్ లైన్లో సరుకులు ఆర్డర్ చేసుకోవచ్చు
- March 25, 2020
సౌదీ అరేబియాలో వినియోగదారులు ఆన్ లైన్ ద్వారా తమకు కావాల్సిన సరుకులు కొనుక్కోవచ్చని ప్రభుత్వం స్పష్టం చేసింది. అదే సమయంలో కర్ఫ్యూ కారణంగా ఎవరు బయటికి రావొద్దని కూడా హెచ్చరించింది. కరోనా వైరస్ వ్యాప్తి నివారణలో భాగంగా కర్ఫ్యూ విధించిన విషయం తెలిసిందే. అయితే..నిత్యావసరాలు, కిరాణా సామను కోసం ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండేందుకు ఆన్ లైన్ సర్వీసులను మాత్రం కొనసాగిస్తోంది. దేశ పౌరులు, నివాసితులు తమకు కావాల్సిన ఆహారం, ఇతర కిరణా సామాగ్రిని బలగ్ తిజరీ అనే యాప్ ద్వారా బుక్ చేసుకోవచ్చని ప్రభుత్వం ప్రకటించింది. లేదంటే 1900కి డయల్ చేసి కూడా కావాల్సిన వస్తువులను ఆర్డర్ చేసుకోచ్చు. అయితే..వినియోగదారులకు షాపుల నుంచి సరైన వస్తువుల, సరైన పద్దతిలో సరఫరా అయ్యేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కిరాణా వస్తువులు, కూరగాయలు, పండ్లు, చికెన్, మటన్, చేపలు, బేకరి ఐటమ్స్ వరకు ఆన్ లైన్ ఆర్డర్ చేసుకునేందుకు అవకాశం కల్పించారు. అలాగే గ్యాస్ బుకింగ్ కూడా యథావిధిగా అందుబాటులో ఉంటుంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..







