రియాద్:యాప్స్ ద్వారా వినియోగదారులు ఆన్ లైన్లో సరుకులు ఆర్డర్ చేసుకోవచ్చు
- March 25, 2020సౌదీ అరేబియాలో వినియోగదారులు ఆన్ లైన్ ద్వారా తమకు కావాల్సిన సరుకులు కొనుక్కోవచ్చని ప్రభుత్వం స్పష్టం చేసింది. అదే సమయంలో కర్ఫ్యూ కారణంగా ఎవరు బయటికి రావొద్దని కూడా హెచ్చరించింది. కరోనా వైరస్ వ్యాప్తి నివారణలో భాగంగా కర్ఫ్యూ విధించిన విషయం తెలిసిందే. అయితే..నిత్యావసరాలు, కిరాణా సామను కోసం ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండేందుకు ఆన్ లైన్ సర్వీసులను మాత్రం కొనసాగిస్తోంది. దేశ పౌరులు, నివాసితులు తమకు కావాల్సిన ఆహారం, ఇతర కిరణా సామాగ్రిని బలగ్ తిజరీ అనే యాప్ ద్వారా బుక్ చేసుకోవచ్చని ప్రభుత్వం ప్రకటించింది. లేదంటే 1900కి డయల్ చేసి కూడా కావాల్సిన వస్తువులను ఆర్డర్ చేసుకోచ్చు. అయితే..వినియోగదారులకు షాపుల నుంచి సరైన వస్తువుల, సరైన పద్దతిలో సరఫరా అయ్యేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కిరాణా వస్తువులు, కూరగాయలు, పండ్లు, చికెన్, మటన్, చేపలు, బేకరి ఐటమ్స్ వరకు ఆన్ లైన్ ఆర్డర్ చేసుకునేందుకు అవకాశం కల్పించారు. అలాగే గ్యాస్ బుకింగ్ కూడా యథావిధిగా అందుబాటులో ఉంటుంది.
తాజా వార్తలు
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్..
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్లో విస్తరిస్తున్న తుఫాన్..?