కువైట్ సిటీ : ధరల నియంత్రణకు షాప్స్, సూపర్ మార్కెట్లపై అధికారుల పర్యవేక్షణ
- March 25, 2020కరోనా వైరస్ కారణంగా సరుకుల కొరతను సొమ్ము చేసుకోవాలనే వ్యాపారులపై కామర్స్, పరిశ్రమల మంత్రిత్వ శాఖ అధికారులు తనిఖీలు కొనసాగిస్తున్నారు. ధరల నియంత్రణకు తగిన చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా తనఖీ టీమ్స్ దాదాపు 151 సహాకార సంఘాలు, సూపర్ మార్కెట్లు, వ్యాపార దుకాణాలు, కూరగాయల షాపులను అధికారులు పర్యవేక్షిస్తున్నారు. వినియోగదారులకు తగిన ధరల్లో నిత్యావసర సరుకులు అందించటమే లక్ష్యంగా తమ తనిఖీలు కొనసాగుతూనే ఉంటాయని వారు వెల్లడించారు. అంతేకాదు లబ్ధిదారులకు సరైన విధంగా ఆహార సామాగ్రి అందించేందుకు తనిఖీ టీమ్స్ 39 క్యాటరింగ్ బ్రాంచులను టేకోవర్ చేసుకున్నాయి. అలాగే 8 బేకరిలను కూడా తమ శాఖకు అనుసంధానం చేశాయి. ఇప్పటివరకు అత్యవసర సేవా కేంద్రానికి 135 హాట్ లైన్ ద్వారా 265 ఫిర్యాదులు అందాయని అధికారులు వెల్లడించారు. ప్రస్తుత విపత్కర పరిస్థితులను సొంత లాభాలకు వాడుకోవాలని చూసే వ్యాపారుల పట్ల తాము కఠినంగా వ్యవహరిస్తామని అధికారులు హెచ్చరించారు.
తాజా వార్తలు
- ఐపీఎల్ టికెట్ల అమ్మకాల్లో భారీ అక్రమాలు..
- ముగిసిన రెండో విడత ఎన్నికల ప్రచారం..
- ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ
- ప్రధాని మోడీ ప్రసంగం పై వచ్చిన ఫిర్యాదులను పరిశీలిస్తున్నాం: ఈసీ
- కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం, 8 కార్లు ఢీ..
- భారతీయుల కోసం కొత్త ‘భా’ షూ సైజింగ్ సిస్టమ్..
- యూఏఈలో పెరగనున్న వాహన, ప్రాపర్టీ బీమా రేట్లు..!
- అక్రమ ప్రాక్టీస్..ప్రవాస మహిళా హెల్త్ ప్రాక్టీషనర్ అరెస్ట్
- వాతావరణ ప్రమాదాలపై కీలక కాన్ఫరెన్స్
- 'మాకు ఇప్పుడు ఇల్లు లేదు'.. దుబాయ్ టవర్ నివాసితులు ఆవేదన