ఇటలీ:గడిచిన 24గంటల్లో 743 మంది మృతి
- March 25, 2020రోమ్: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్.. ఇటలీలో విజృంభిస్తోంది. కరోనా పుట్టిల్లు చైనాలో కన్నా ఇటలీలొనే ఎక్కువమంది ఈ వైరస్ కు బలయ్యారంటేనే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అయితే రెండ్రోజులుగా ఇటలీలో కరోనా మరణాలు కొంచెం తగ్గుముఖం పట్టాయి. దీంతో నెమ్మదిగా పరిస్థితి అదుపులోకి వస్తోందని అంతా భావించారు. కానీ ఈ అంచనాలన్నీ ఇప్పుడు తారుమారయ్యాయి. ఎందుకంటే ఇటలీలో మృతుల సంఖ్య మళ్ళీ పెరిగింది. గడిచిన 24గంటల్లో ఇక్కడ 743 మంది కరోనా మహమ్మారికి బలయ్యారు. సోమవారం ఈ సంఖ్య 608గా ఉంది. అలానే కరోనా పాజిటివ్ కేసులు కూడా ఎక్కువయ్యాయి. ప్రస్తుతం ఇటలీలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 69,176. కరోనా బాధితులు ఎక్కువగా ఉన్న దేశాల జాబితాలో చైనా తర్వాత ఇటలీనే ఉంది.
తాజా వార్తలు
- ఇండియా కాదని చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్..కారణం ఏంటి?
- ‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం
- వెదర్ అలెర్ట్.. మే 2న వర్షాలు
- 35కి చేరిన ఫుడ్ పాయిజన్ కేసులు
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్కు సయ్యద్ థెయాజిన్
- హోలోగ్రామ్లుగా యూఏఈ ల్యాండ్మార్క్లు..!
- బహ్రెయిన్ లో వారంపాటు 'అస్థిర' వాతావరణం..!
- విద్యార్థిగా గోల్డెన్ వీసా కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
- వికలాంగులకు BD1.2 మిలియన్ల వార్షిక సహాయ నిధి
- ఈజిప్టులో నేరం.. కువైట్లో నిందితుడి అరెస్ట్