యూఏఈ:వారంతంలో రవాణా వ్యవస్థ బంద్
- March 26, 2020యూఏఈ:కరోనా వైరస్ కట్టడికి యూఏఈ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ఈ వారంతంలో దేశవ్యాప్తంగా స్టెరిలైజేషన్ (కెమికల్స్ తో శుద్ధి చేయటం) చేయాలని నిర్ణయించింది. దీంతో ఈ నెల 26న రాత్రి 8 గంటల నుంచి 29 ఉదయం 6 గంటల వరకు దుబాయ్ మెట్రోతో సహా ప్రజా రవాణా వ్యవస్థను నిలిపివేయనున్నట్లు యూఏఈ ప్రకటించింది. జాతీయ స్టెరిలైజేషన్ కార్యక్రమంలో భాగంగా ప్రజా సంస్థలు, ప్రజా రవాణా సంస్థకు చెందిన వాహనాలు, మెట్రో సర్వీసులను అన్నింటిని స్టెరిలైజ్ చేయనున్నారు. ఈ నాలుగు రోజులు దేశవ్యాప్తంగా ట్రాఫిక్ ను నియంత్రించటంతో పాటు అన్ని రకాల రవాణా సౌకర్యాలను నిలిపివేస్తున్నట్లు తెలిపారు. అంతేకాదు ఈ నాలుగు రోజులు ప్రజలు ఎవరు బయటికి రావొద్దని కూడా ఆరోగ్య, అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారులు ప్రజలకు సూచించారు. అయితే..ఆహారం, మెడిసిన్ కావాల్సిన వారికి మాత్రం బయటికి వచ్చేందుకు మినహాయించారు. అలాగే మిలటరీ, పోలీసులు, ఆరోగ్య శాఖకు చెందిన ఉద్యోగులు, విద్యుత్, పోస్టల్, పోస్టల్, గ్యాస్ స్టేషన్ తరహా ఎమర్జెన్సీ ఉద్యోగులకు కూడా మినహాయింపు ఇచ్చారు. ఎమర్జెన్సీ విభాగాల ఉద్యోగుల సర్వీసులు యథావిధిగా కొనసాగుతాయిని స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ