కరోనా ఎఫెక్ట్:దుబాయ్ లో ఇక నుంచి ట్యాక్సీలో ఇద్దరికే అనుమతి
- March 26, 2020దుబాయ్:కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు దుబాయ్ రవాణా శాఖ అధికారులు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి ట్యాక్సీ ఇద్దరికి మించి వెళ్లకూడదని ఆంక్షలు విధించారు. ఒక ట్యాక్సీలో డ్రైవరుతో పాటు మరో ఇద్దరు ప్రయాణికులకు మాత్రమే అనుమతించనున్నారు. అలాగే బస్, మెట్రోలో కూడా ప్రయాణికులు నిర్దిష్ట దూరాన్ని పాటించాలని సూచించారు. బస్ రియర్ డోర్ ను మూసి ఉంచి ముందు వెనక డోర్ల ద్వారా ప్యాసింజర్లను అనుమతిస్తారు. అయితే..బస్ షెల్టర్ లు మాత్రం తాత్కాలికంగా మూసివేసే ఉంటాయి. ప్రయాణికుల అవసరం మేరకు మెట్రో సర్వీసు ట్రిప్పుల సంఖ్యను పెంచనున్నారు. పీబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ రైడర్లు వీలైనంత వరకు పబ్లిక్ ట్రాన్స్ పోర్టును వినియోగించకపోవటమే మేలని ఆర్టీఏ అధికారులు సూచించారు. కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన మార్గదర్శకాల మేరకు దుబాయ్ ఆర్టీఏ ఈ నిర్ణయాన్ని తీసుకుంది.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ