కరోనా వైరస్ నిర్మూలనా చర్యలకు రూ.70 లక్షలు విరాళం
- March 26, 2020ప్రస్తుతం దేశంలో కరోనా మహమ్మారి ప్రమాదకరంగా విస్తరిస్తున్న నేపథ్యంలో సామాన్యులను ఆదుకునేందుకు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కరోనా నిర్మూలనా చర్యలకు రూ.70 లక్షలు విరాళమిస్తున్నట్లు ప్రకటిస్తూ తొలి ట్వీట్ చేశారు.
‘‘పవన్ కల్యాణ్గారి ట్వీట్ చూసి స్ఫూర్తి పొందాను. కరోనా(కోవిడ్ 19) నివారణ కోసం కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలకు రూ.70 లక్షల రూపాయలను అందిస్తున్నాను. కరోనా నివారణకు గౌరవనీయులైన ప్రధాని మంత్రి నరేద్రమోదీగారు, మన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్గారు, జగన్ మోహన్రెడ్డిగారు తీసుకుంటున్న చర్యలు ప్రశంసనీయం. బాధ్యత గల పౌరుడిగా ప్రభుత్వాలు సూచించిన నియమాలను పాటించాలని కోరుతున్నాను’’ అని ట్విట్టర్లో పేర్కొన్నారు రామ్చరణ్.
కరోనా నిర్మూలనా చర్యలకు రూ.70 లక్షలు విరాళం ఇచ్చినందుకు రామ్చరణ్కు తన బాబాయ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ట్విట్టర్ ద్వారా హృదయ పూర్వక అభినందనలు తెలిపారు.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు