కువైట్:రెసిడెన్సీ ఉల్లంఘించినవారికి జరిమానా లేదు
- March 27, 2020
కువైట్:కరోనా వైరస్ ను నియంత్రించేందుకు గల్ఫ్ కంట్రీస్ వీలైనన్ని చర్యలు చేపడుతున్నాయి. ప్రవాసీయులను వీలైనంత వరకు తమ దేశాలకు పంపించేలా నిబంధనలను సడలిస్తున్నాయి. సౌదీ ప్రభుత్వం 250 మంది ప్రవాస ఖైదీలను విడిచిపెడితే...లేటెస్ట్ గా కువైట్ ప్రభుత్వం కూడా ప్రవాసీయులకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. కువైట్ లోని ఉంటున్న ప్రవాసీయులు...రెసిడెన్సీ నిబంధనలు ఉల్లంఘించినా జరిమానా చెల్లించక్కర్లేదని ప్రకటించింది. అయితే..ఏప్రిల్ 1 నుంచి 30 లోగా వారు తమ తమ దేశాలకు తిరిగి వెళ్లిన వారికి మాత్రమే ఈ మినహాయింపు ఇచ్చింది. ఆ తర్వాత పరిస్థితులు చక్కబడ్డాక న్యాయపరమైన ప్రక్రియ పూర్తి చేసుకొని తిరిగి కువైట్ రావొచ్చని కూడా స్పష్టం చేసింది. అయితే..రెసిడెన్సీ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు ఉంటే మాత్రం ప్రవాస వ్యవహారాల సాధారణ పరిపాలన విభాగం అధికారులను సంప్రదించాలని సూచించింది. అంతేకాదు ఏప్రిల్ 1 నుంచి 30 లోగా దేశం విడిచిపెట్టి వెళ్లని ప్రవాసీయులు జరినామా చెల్లించటంతో పాటు దేశ బహిష్కరణ కూడా ఎదుర్కొవాల్సి వస్తుందని కూడా కువైట్ ప్రభుత్వం హెచ్చరించింది.
తాజా వార్తలు
- ఖతార్ విధానాలలో శాంతి, భద్రత అంతర్భాగాలు..!!
- అమెరికాతో ప్రాంతీయ పరిస్థితిపై చర్చించిన సౌదీ రక్షణ మంత్రి..!!
- యూఏఈలో త్వరలో డ్రోన్ ఫుడ్ ఆర్డర్ల డెలివరీ..!!
- ఎయిర్పోర్ట్ కొత్త టెర్మినల్ను పరిశీలించిన పీఎం..!!
- నిరుద్యోగ అప్పీళ్ల కోసం ఆన్లైన్ వ్యవస్థ..!!
- ఒమన్లో హాకీ5స్ కార్నివాల్..500 మంది ఆటగాళ్లు, 47 జట్లు..!!
- విదేశీ నిపుణులు మాకు అవసరం..ట్రంప్ యూటర్న్
- పెట్టుబడుల సదస్సుకు సన్నాహాలు పూర్తి.. విశాఖకు సీఎం రాక
- తెలుగు రాష్ట్రాల్లో భారీగా తగ్గిన ఉష్ణోగ్రతలు
- ఫోటోలు తీస్తుండగా భవనం పై నుంచి పడి భారతీయ యువకుడు మృతి..!!







