కువైట్:రెసిడెన్సీ ఉల్లంఘించినవారికి జరిమానా లేదు
- March 27, 2020
కువైట్:కరోనా వైరస్ ను నియంత్రించేందుకు గల్ఫ్ కంట్రీస్ వీలైనన్ని చర్యలు చేపడుతున్నాయి. ప్రవాసీయులను వీలైనంత వరకు తమ దేశాలకు పంపించేలా నిబంధనలను సడలిస్తున్నాయి. సౌదీ ప్రభుత్వం 250 మంది ప్రవాస ఖైదీలను విడిచిపెడితే...లేటెస్ట్ గా కువైట్ ప్రభుత్వం కూడా ప్రవాసీయులకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. కువైట్ లోని ఉంటున్న ప్రవాసీయులు...రెసిడెన్సీ నిబంధనలు ఉల్లంఘించినా జరిమానా చెల్లించక్కర్లేదని ప్రకటించింది. అయితే..ఏప్రిల్ 1 నుంచి 30 లోగా వారు తమ తమ దేశాలకు తిరిగి వెళ్లిన వారికి మాత్రమే ఈ మినహాయింపు ఇచ్చింది. ఆ తర్వాత పరిస్థితులు చక్కబడ్డాక న్యాయపరమైన ప్రక్రియ పూర్తి చేసుకొని తిరిగి కువైట్ రావొచ్చని కూడా స్పష్టం చేసింది. అయితే..రెసిడెన్సీ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు ఉంటే మాత్రం ప్రవాస వ్యవహారాల సాధారణ పరిపాలన విభాగం అధికారులను సంప్రదించాలని సూచించింది. అంతేకాదు ఏప్రిల్ 1 నుంచి 30 లోగా దేశం విడిచిపెట్టి వెళ్లని ప్రవాసీయులు జరినామా చెల్లించటంతో పాటు దేశ బహిష్కరణ కూడా ఎదుర్కొవాల్సి వస్తుందని కూడా కువైట్ ప్రభుత్వం హెచ్చరించింది.
తాజా వార్తలు
- ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ అలర్ట్
- భోగాపురానికి ప్రధాని మోదీ.. పూర్తి షెడ్యూల్ ఇదే !!
- జీవన నాణ్యతలో ఆసియాలో ఒమన్కు తొలి స్థానం..!!
- ఖతార్లో ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై చర్యలు..!!
- దక్షిణ అల్ బతీనాహ్ గవర్నరేట్లో భారీ వర్షాలు..!!
- ఇరాన్పై సైనిక చర్యల్లో భాగస్వామ్యం.. WSJ కథనాన్ని ఖండించిన కువైట్..!!
- దుబాయ్ డేట్ ఫెస్టివల్ లో పాల్గొనేవారికి Dh1 మిలియన్ గ్రాంట్..షేక్ హమ్దాన్ ఆదేశాలు..!!
- సౌదీ మరో ఘనత..అంతర్జాతీయ ఐఎస్ఓ కమిటీకి నేతృత్వం..!!
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..







