కరోనా ఎఫెక్ట్:250 మంది ప్రవాస ఖైదీలను విడుదల చేసిన సౌదీ
- March 27, 2020
సౌదీ:గల్ఫ్ దేశాల్లో మహమ్మారి కరోనావైరస్ శరవేగంగా విస్తరిస్తోంది. దీంతో సౌదీ ప్రభుత్వం కరోనా వ్యాప్తి, నివారణకు కఠిన చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా దేశంలోని పలు జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న దాదాపు 250 ప్రవాస ఖైదీలను విడుదల చేసింది. వీరందరూ ఇమ్మిగ్రేషన్, రెసిడెన్సీ నేరాలలో జైలులో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. జైలులో కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ఈ 250 మందిని విడుదల చేసినట్టు మానవ హక్కుల కమిషన్ అధ్యక్షుడు అవద్ అల్ అవద్ తెలిపారు. రాబోయే రోజుల్లో మరికొంత మంది ఖైదీలను విడుదల చేసే దిశగా సౌదీ ప్రభుత్వం ఆలోచిస్తుందని కూడా ఆయన చెప్పారు. ప్రజా ఆరోగ్య సంరక్షణ విషయంలో సౌదీ ప్రభుత్వం ఏ మాత్రం రాజీ లేకుండా పోరాడుతుందని ఈ నిర్ణయంతో మరోసారి చాటుకుందని అవద్ అల్ అవద్ అన్నారు.
తాజా వార్తలు
- ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ అలర్ట్
- భోగాపురానికి ప్రధాని మోదీ.. పూర్తి షెడ్యూల్ ఇదే !!
- జీవన నాణ్యతలో ఆసియాలో ఒమన్కు తొలి స్థానం..!!
- ఖతార్లో ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై చర్యలు..!!
- దక్షిణ అల్ బతీనాహ్ గవర్నరేట్లో భారీ వర్షాలు..!!
- ఇరాన్పై సైనిక చర్యల్లో భాగస్వామ్యం.. WSJ కథనాన్ని ఖండించిన కువైట్..!!
- దుబాయ్ డేట్ ఫెస్టివల్ లో పాల్గొనేవారికి Dh1 మిలియన్ గ్రాంట్..షేక్ హమ్దాన్ ఆదేశాలు..!!
- సౌదీ మరో ఘనత..అంతర్జాతీయ ఐఎస్ఓ కమిటీకి నేతృత్వం..!!
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..







