కరోనా ఎఫెక్ట్:250 మంది ప్ర‌వాస ఖైదీల‌ను విడుద‌ల చేసిన సౌదీ

- March 27, 2020 , by Maagulf
కరోనా ఎఫెక్ట్:250 మంది ప్ర‌వాస ఖైదీల‌ను విడుద‌ల చేసిన సౌదీ

 సౌదీ:గ‌ల్ఫ్ దేశాల్లో మ‌హ‌మ్మారి క‌రోనావైర‌స్ శ‌ర‌వేగంగా విస్త‌రిస్తోంది. దీంతో సౌదీ ప్రభుత్వం క‌రోనా వ్యాప్తి, నివార‌ణ‌కు కఠిన చ‌ర్య‌లు తీసుకుంటోంది. ఇందులో భాగంగా దేశంలోని పలు జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న దాదాపు 250 ప్ర‌వాస ఖైదీల‌ను విడుద‌ల చేసింది. వీరంద‌రూ ఇమ్మిగ్రేషన్, రెసిడెన్సీ నేరాలలో జైలులో ఉన్న‌ట్లు అధికారులు వెల్లడించారు. జైలులో క‌రోనా వ్యాప్తిని అరిక‌ట్టేందుకు ఈ 250 మందిని విడుద‌ల చేసిన‌ట్టు మానవ హక్కుల కమిషన్ అధ్యక్షుడు అవద్ అల్ అవద్ తెలిపారు. రాబోయే రోజుల్లో మరికొంత మంది ఖైదీల‌ను విడుద‌ల చేసే దిశ‌గా సౌదీ ప్రభుత్వం ఆలోచిస్తుందని కూడా ఆయ‌న చెప్పారు. ప్రజా ఆరోగ్య సంరక్షణ విషయంలో సౌదీ ప్రభుత్వం ఏ మాత్రం రాజీ లేకుండా పోరాడుతుందని ఈ నిర్ణయంతో మరోసారి చాటుకుందని అవద్ అల్ అవద్ అన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com