పీఎం కేర్స్ ఫండ్ కు అక్షయ్ కుమార్ రూ.25 కోట్ల భారీ విరాళం

- March 28, 2020 , by Maagulf
పీఎం కేర్స్ ఫండ్ కు అక్షయ్ కుమార్ రూ.25 కోట్ల భారీ విరాళం

అక్షయ్ కుమార్ భారీ విరాళం ప్రకటించారు. దేశంలో 21 రోజుల లాక్ డౌన్ విధించిన నేపథ్యంలో విరివిగా విరాళాలు ఇవ్వాలన్న ప్రధాని నరేంద్ర మోదీ విజ్ఞప్తికి బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ స్పందించారు. ప్రధాని ఏర్పాటు చేసిన పీఎం కేర్స్ ఫండ్ కు రూ.25 కోట్ల భారీ విరాళం ప్రకటించారు.

ఇప్పుడు ప్రతి విషయం దేశ ప్రజల ప్రాణాలకు సంబంధించినదేనని అక్షయ్ కుమార్ ఈ సందర్భంగా ట్వీట్ చేశారు. మనవాళ్ల కోసం ఏదో ఒకటి చేయాల్సిన అవసరం ఉందని, నేను పొదుపు చేసిన డబ్బు నుంచి పాతిక కోట్ల రూపాయలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏర్పాటు చేసిన పీఎం కేర్స్ ఫండ్ కు విరాళంగా ఇస్తున్నానని తెలిపారు. "మనం ప్రాణాలను కాపాడుదాం. ప్రాణాలుంటేనే జీవించగలం" అంటూట్వీట్ చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com