దుబాయ్ : వినియోగదారులకు ఊరట..మార్కెట్లో దోపిడిపై ఫిర్యాదుకు హెల్ప్ లైన్
- March 29, 2020కరోనా వైరస్ నేపథ్యంలో పండ్లు, కూరగాయల ధరల నియంత్రణకు దుబాయ్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇక నుంచి ఎవరైనా ధరలు పెంచి అమ్మితే తమకు ఫిర్యాదు చేయాలని ప్రత్యేకంగా హెల్ప్ లైన్ ను ఏర్పాటు చేశారు అధికారులు. నిబంధనలకు విరుద్ధంగా ఏ స్టోర్ లో అయినా పండ్లు, కూరగాయలను ఎక్కువ ధరలకు అమ్మితే 600545555 నెంబర్ కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని వినియోగదారులకు సూచించారు. లేదంటే దుబాయ్ కన్సూమర్ (Dubai Consumer) పేరుతో రూపొందించిన మొబైల్ యాప్ ద్వారా కూడా ఫిర్యాదు చేయొచ్చని ప్రకటించింది. కరోనా వైరస్ నేపథ్యంలో విదేశాల నుంచి దిగుమతులు నెమ్మదించటంతో ఇదే అదనుగా వర్తకులు దోపిడికి పాల్పడుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే చాలా మంది వినియోగదారులు పెరిగిన ధరలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే ధరల నియంత్రణకు వినియోగదారుల ప్రయోజనం దృష్ట్యా ప్రస్తుత హెల్ప్ లైన్ ను ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా