కువైట్: ప్రజలు ఆరోగ్య శాఖ సూచనలు పాటించకపోతే కర్ఫ్యూ గంటలు పొడగింపు
- March 29, 2020
కరోనా వైరస్ నియంత్రణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు ప్రజలు ఎట్టిపరిస్థితుల్లోనూ కట్టుబడి ఉండాల్సిందేనని కువైట్ ప్రభుత్వం హెచ్చరించింది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ సూచనలు పాటించకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు. అవసరమైతే కర్ఫ్యూ సమయాన్ని పొడగించేందుకు కూడా వెనుకాడే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు ఉప ప్రధానమంత్రి, అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి అనస్ అల్ సలెహ్ ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రజలు కర్ఫ్యూ నిబంధనలు తూచ తప్పకుండా పాటించాలన్నారు. అలాగే కర్ఫ్యూ లేని సమయాల్లోనూ ఆరోగ్య శాఖ సూచించిన అన్ని అంశాలను విధిగా పాటించాలన్నారు. లేదంటే ప్రజా ప్రయోజనాల కోసం దేశమంతా పూర్తిగా కర్ఫ్యూ విధించేందుకు కూడా వెనుకాడబోమని అన్నారాయన.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







