కువైట్: ప్రజలు ఆరోగ్య శాఖ సూచనలు పాటించకపోతే కర్ఫ్యూ గంటలు పొడగింపు
- March 29, 2020
కరోనా వైరస్ నియంత్రణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు ప్రజలు ఎట్టిపరిస్థితుల్లోనూ కట్టుబడి ఉండాల్సిందేనని కువైట్ ప్రభుత్వం హెచ్చరించింది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ సూచనలు పాటించకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు. అవసరమైతే కర్ఫ్యూ సమయాన్ని పొడగించేందుకు కూడా వెనుకాడే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు ఉప ప్రధానమంత్రి, అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి అనస్ అల్ సలెహ్ ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రజలు కర్ఫ్యూ నిబంధనలు తూచ తప్పకుండా పాటించాలన్నారు. అలాగే కర్ఫ్యూ లేని సమయాల్లోనూ ఆరోగ్య శాఖ సూచించిన అన్ని అంశాలను విధిగా పాటించాలన్నారు. లేదంటే ప్రజా ప్రయోజనాల కోసం దేశమంతా పూర్తిగా కర్ఫ్యూ విధించేందుకు కూడా వెనుకాడబోమని అన్నారాయన.
తాజా వార్తలు
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు







