కువైట్: ప్రజలు ఆరోగ్య శాఖ సూచనలు పాటించకపోతే కర్ఫ్యూ గంటలు పొడగింపు
- March 29, 2020కరోనా వైరస్ నియంత్రణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు ప్రజలు ఎట్టిపరిస్థితుల్లోనూ కట్టుబడి ఉండాల్సిందేనని కువైట్ ప్రభుత్వం హెచ్చరించింది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ సూచనలు పాటించకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు. అవసరమైతే కర్ఫ్యూ సమయాన్ని పొడగించేందుకు కూడా వెనుకాడే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు ఉప ప్రధానమంత్రి, అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి అనస్ అల్ సలెహ్ ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రజలు కర్ఫ్యూ నిబంధనలు తూచ తప్పకుండా పాటించాలన్నారు. అలాగే కర్ఫ్యూ లేని సమయాల్లోనూ ఆరోగ్య శాఖ సూచించిన అన్ని అంశాలను విధిగా పాటించాలన్నారు. లేదంటే ప్రజా ప్రయోజనాల కోసం దేశమంతా పూర్తిగా కర్ఫ్యూ విధించేందుకు కూడా వెనుకాడబోమని అన్నారాయన.
తాజా వార్తలు
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం