కరోనా ఎఫెక్ట్:తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల్లో 75 శాతం కోత
- March 30, 2020హైదరాబాద్:తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలపై కరోనా ఎఫెక్ట్ గట్టిగానే పడింది. ఉద్యోగుల వేతనాల్లో 75 శాతం కోత విధిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అంతే కాకుండా సీఎం, మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు సహా కార్పొరేషన్ల చైర్మన్లు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల వేతనాల్లో కూడా 75 శాతం కోత విధిస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. అఖిలభారత సర్వీస్ అధికారుల వేతనాల్లో 60 శాతం కోత విధించనున్నారు. ఇక మిగిలిన కేటగిరీల ఉద్యోగుల వేతనాల్లో 50 శాతం కోత విధించనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.
ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వ గ్రాంటు పొందుతున్న సంస్థల ఉద్యోగుల వేతనాల్లోనూ కోత విధించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నాల్గవ తరగతి, ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగుల వేతనాల్లో 10 శాతం కోత విధించనున్నారు. అన్ని రకాల రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్లలో 50 శాతం, నాల్గవ తరగతి రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ లో 10 శాతం కోత విధించనున్నారు.
తాజా వార్తలు
- తెలంగాణలో ఎన్నికల ప్రచారంకు రాహుల్, ప్రియాంక..
- ప్రైవేట్, ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్..!
- ప్రయాణికులకు దుబాయ్ ఎయిర్పోర్ట్స్, విమానయాన సంస్థలు కీలక సూచనలు..!
- ఒమన్ లో కీలకమైన యునెస్కో, అరబ్ ప్రతినిధుల సమావేశం
- దుబాయ్ మెట్రో పని వేళలు పొడిగుంపు
- పిల్లల రక్షణకు స్మోకింగ్ వ్యతిరేక ప్రచారం ప్రారంభం
- ‘ఆటోమెకానికా రియాద్’ ఎడిషన్ ప్రారంభం
- షార్జాలో స్కూళ్లలో ఆన్లైన్ ఎడ్యుకేషన్ అమలు
- అద్భుతంగా 'వరల్డ్ తెలుగు కన్సార్టియం' అంతర్జాల సమావేశం
- లండన్లో కత్తిపోట్లు..పలువురికి గాయాలు