కరోనా/యూఏఈ: 2021 కు వాయిదా పడనున్న ఎక్స్పో 2020
- March 30, 2020
దుబాయ్: కరోనా మహమ్మారికి ప్రపంచ దేశాలు అతలాకుతలం అవుతున్న సంగతి చూస్తున్నాం. కరోనా ధాటికి ఇప్పటికే టోక్యో లో జరగాల్సిన ఒలింపిక్స్ వాయిదాపడ్డ సంగతి విదితమే. దుబాయ్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న అతిపెద్ద ఈవెంట్ 'Expo 2020'. దీనికి గాను దుబాయ్ ఎంతో వ్యయప్రయాసలకు లోనై ప్రపంచపు అతిపెద్ద ఎక్స్పో గా తీర్చిదిద్దెందుకు సర్వ సన్నాహాలు చేస్తోంది. ఇప్పుడు దుబాయ్ చేపడుతున్న ఈ Expo కి ఎదురుదెబ్బ కరోనా రూపంలో ఎదురైంది.
ఈరోజు సాయంత్రం జరిగిన కోర్ కమిటీ సమావేశంలో కరోనా వ్యాపించకుండా కట్టడి చేసేందుకు ఈ ఎక్స్పో ను ఒక సంవత్సరం పాటు వాయిదావేయాలని యూఏఈ కి ఇతర దేశాలు సిఫారసు చేశాయి. ఈ ప్రతిపాదనకు యూఏఈ తన మద్దతు ప్రకటించింది, కానీ, పాలకమండలి కొన్ని ప్రక్రియలను అనుసరించి జనరల్ అసెంబ్లీ నుండి మూడింట రెండు వంతుల మెజారిటీ ఓటు పొందిన తర్వాతే ఎక్స్పో వాయిదాపై తుది నిర్ణయం ఉంటుంది అని యూఏఈ ప్రకటించింది.
తాజా వార్తలు
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు







