కరోనా/యూఏఈ: 2021 కు వాయిదా పడనున్న ఎక్స్పో 2020
- March 30, 2020
దుబాయ్: కరోనా మహమ్మారికి ప్రపంచ దేశాలు అతలాకుతలం అవుతున్న సంగతి చూస్తున్నాం. కరోనా ధాటికి ఇప్పటికే టోక్యో లో జరగాల్సిన ఒలింపిక్స్ వాయిదాపడ్డ సంగతి విదితమే. దుబాయ్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న అతిపెద్ద ఈవెంట్ 'Expo 2020'. దీనికి గాను దుబాయ్ ఎంతో వ్యయప్రయాసలకు లోనై ప్రపంచపు అతిపెద్ద ఎక్స్పో గా తీర్చిదిద్దెందుకు సర్వ సన్నాహాలు చేస్తోంది. ఇప్పుడు దుబాయ్ చేపడుతున్న ఈ Expo కి ఎదురుదెబ్బ కరోనా రూపంలో ఎదురైంది.
ఈరోజు సాయంత్రం జరిగిన కోర్ కమిటీ సమావేశంలో కరోనా వ్యాపించకుండా కట్టడి చేసేందుకు ఈ ఎక్స్పో ను ఒక సంవత్సరం పాటు వాయిదావేయాలని యూఏఈ కి ఇతర దేశాలు సిఫారసు చేశాయి. ఈ ప్రతిపాదనకు యూఏఈ తన మద్దతు ప్రకటించింది, కానీ, పాలకమండలి కొన్ని ప్రక్రియలను అనుసరించి జనరల్ అసెంబ్లీ నుండి మూడింట రెండు వంతుల మెజారిటీ ఓటు పొందిన తర్వాతే ఎక్స్పో వాయిదాపై తుది నిర్ణయం ఉంటుంది అని యూఏఈ ప్రకటించింది.
తాజా వార్తలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం విఫలం.. వైమానిక రక్షణ వ్యవస్థల విజయవంతమైన ప్రతిఘటన
- ఢిల్లీలో కుండపోత వర్షం..ఆరెంజ్ అలర్ట్ జారీ
- లోగో డిజైన్ చేయండి.. రూ.లక్ష గెలుచుకోండి: తెలంగాణ హౌసింగ్ బోర్డు
- ట్రంప్ ఆదేశాలతో ఇరాన్ పై అమెరికా సైన్యం భీకర దాడులు..
- ఈ-వేస్ట్ నిర్వహణలో సౌదీకి అంతర్జాతీయ గుర్తింపు..!!
- శంషాబాద్ వద్ద ఘోరరోడ్డు ప్రమాదం..
- మెల్బోర్న్లో ప్రధాని మోదీకి ఘనస్వాగతం..
- కువైట్ అగ్రనేతలతో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ భేటీ..!!
- సిరియా పై ట్రంప్ కీలక నిర్ణయం..
- ఇరాన్ దాడుల్లో దెబ్బతిన్న ఇళ్ల మరమ్మతుల పురోగతిపై సమీక్ష..!!







