కరోనా క్రైసిస్ చారిటీకి యంగ్ హీరో సందీప్ కిషన్ రూ. 3 లక్షల విరాళం
- March 30, 2020
పేద సినీ కళాకారులు, కార్మికులను ఆదుకోవడంలో యువ కథానాయకుడు సందీప్ కిషన్ భాగస్వాములయ్యారు. ప్రస్తుతం నడుస్తున్న సంక్షోభ కాలంలో సినిమా షూటింగ్లు లేక ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న సినీ కార్మికులకు చేయూత నిచ్చేందుకు మెగాస్టార్ చిరంజీవి ఛైర్మన్గా ఏర్పాటైన కరోనా క్రైసిస్ చారిటీ (సీసీసీ)కి సందీప్ కిషన్ రూ. 3 లక్షలు విరాళంగా ప్రకటించారు. దీంతో పాటు 'వివాహ భోజనంబు' రెస్టారెంట్లలో పనిచేస్తున్న 500కు పైగా ఉద్యోగుల బాగోగులను సైతం ఆయన చూసుకుంటున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి ప్రస్తుతం కీలక దశలో ఉందనీ, దీన్ని సమర్థంగా ఎదుర్కోవడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమల్లోకి తెచ్చిన లాక్డౌన్ను అందరూ గౌరవించాలనీ, వైద్యులు, పోలీసుల సూచనలను పాటిస్తూ, అందరూ తమ ఇళ్లకే పరిమితమై ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనీ సందీప్ కిషన్ కోరారు.
తాజా వార్తలు
- దుబాయ్లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్
- క్షిపణి డెబ్రిస్ ఫోటోలు తీయొద్దు.. షేర్ చేయొద్దు: కువైట్ వార్న్
- బహ్రెయిన్ 'మాన్' కార్యక్రమానికి రెండు అరబ్ అవార్డులు..!!
- చైనా, మలేషియా బ్యాటరీలపై యాంటీ-డంపింగ్ సుంకాలు: ఖతార్
- యూఏఈ నుంచి భారత్కు ఎంత బంగారం తీసుకెళ్లొచ్చు? 2026లో కొత్త నిబంధనలు ఇవే..!!
- దుబాయ్ మెట్రో బ్లూ లైన్ టన్నెలింగ్లో మరో మైలురాయి.. రెండు నెలల్లో తొలి దశ పూర్తి
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం విఫలం.. వైమానిక రక్షణ వ్యవస్థల విజయవంతమైన ప్రతిఘటన







