PM కేర్స్ ఫండ్ కు 500కోట్లు విరాళమిచ్చిన రిలయన్స్ ఇండస్ట్రీస్
- March 31, 2020కరోనాపై పోరాటంలో భాగంగాకేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చర్యలకు తోడు తమ వంతు సాయం అందించేందుకు రిలయన్స్ ఇండస్ట్రీస్ ముందుకొచ్చింది. సోమవారం రిలయన్స్ ఇండస్ట్రీస్ (RIL) పీఎం-కేర్స్ ఫండ్కు రూ .500 కోట్లు విరాళంగా ఇస్తున్నట్లు తెలిపింది. అలాగే మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలకు అదనంగా 5 కోట్ల రూపాయలు ఇస్తున్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. కరోనావైరస్ మహమ్మారికి వ్యతిరేకంగా దేశం చేస్తున్న పోరాటాన్ని బలోపేతం చేయడానికి PM-CARES నిధిని రూపొందించారు. ఈ నిధికి విరాళాలు ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల పౌరులకు విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే.
అంతేకాకుండా,భారతదేశపు మొట్టమొదటి 100 పడకల ప్రత్యేకమైన COVID-19 హాస్పిటల్ కరోనావైరస్ రోగుల చికిత్సకు కేవలం రెండు వారాల్లో సన్నద్ధం చేయనున్నట్లు రిలయన్స్ తెలిపింది. ముఖేష్ భార్య నీతా అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఫౌండేషన్ దేశవ్యాప్తంగా నిరుపేదలకు ఉచిత భోజనం అందిస్తామని హామీ ఇచ్చింది. అదనంగా, COVID-19 తో పోరాడుతున్న రోగుల కోసం తమకు చెందిన మొత్తం ఆసుపత్రిని కూడా విరాళంగా ఇచ్చారు అంబానీ.
తాజా వార్తలు
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం
- రవాబీ హైపర్మార్కెట్లో మ్యాంగో ఫియస్టా ప్రారంభం
- అవినీతి లేదా రాజద్రోహానికి పాల్పడిన అధికారులకు 'హిస్ ఎక్సలెన్సీ' బిరుదు తొలగింపు
- వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024..18 స్థానాలు ఎగబాకిన ఒమన్
- దుబాయ్ ఆర్ట్ గ్యాలరీలో అమ్మకానికి 'పురాతన సముద్రపు డ్రాగన్' పుర్రె
- తల్లిదండ్రులకు స్కూల్ ఫీజు పెంపు నోటిఫికేషన్లు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్
- ఖలిస్థానీ ఉగ్రవాది హత్య కేసు.. ముగ్గురు భారతీయులు అరెస్టు
- బంగారం స్వచ్ఛతను తనిఖీ చేసే ఐదు సులభమైన మార్గాలు