కరోనా ఎఫెక్ట్:EMI చెల్లించకున్నా డిఫాల్టర్గా పరిగణించొద్దు
- March 31, 2020
ముంబై:సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) లోన్లు తీసుకున్న వారికి భారీ ఊరట ఇచ్చింది. ఈ మేరకు సోమవారం ప్రకటించింది. కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు భారత దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధించింది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో బ్యాంకు లోన్ల రీపేమెంట్, ఈఎంఐలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మూడు నెలల మారటోరియం విధించటంతో క్రెడిట్ రేటింగ్ సంస్థలకు సెబీ సోమవారం కీలక ఆదేశాలు జారీ చేసింది.
రుణగ్రహీతలు ఈ మూడు నెలల్లో రుణాలు చెల్లించకపోయినా డిఫాల్ట్గా పరిగణించరాదని క్రెడిట్ రేటింగ్ సంస్థలకు సూచించింది. క్రెడిట్ రేటింగ్ సంస్థ వినియోగదారుని రుణ చెల్లింపు విశ్లేషణలో భాగంగా ఎవరైనా రుణగ్రహీత ఈ మూడు నెలల్లో తాను తీసుకున్న రుణంపై చెల్లించాల్సిన వడ్డీగానీ అసలుగానీ సకాలంలో చెల్లించలేకపోయినప్పటికీ దానిని డిఫాల్ట్గా చూడవద్దని తెలిపింది.
ఈ విధానం ఆర్బీఐ నిర్దేశించిన కాలపరిమితి వరకు కొనసాగుతుందని రేటింగ్ సంస్థలకు జారీ చేసిన సర్క్యులర్లో స్పష్టం చేసింది. ఇండియా లాక్ డౌన్ నేపథ్యంలో ఇటీవల ఆర్బీఐ హోమ్ లోన్, వ్యాపార లోన్, వెహికిల్ లోన్, పర్సనల్ లోన్.. ఇలా వివిధ లోన్లపై మూడు నెలల మారటోరియం విధించిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- ఖతార్ విధానాలలో శాంతి, భద్రత అంతర్భాగాలు..!!
- అమెరికాతో ప్రాంతీయ పరిస్థితిపై చర్చించిన సౌదీ రక్షణ మంత్రి..!!
- యూఏఈలో త్వరలో డ్రోన్ ఫుడ్ ఆర్డర్ల డెలివరీ..!!
- ఎయిర్పోర్ట్ కొత్త టెర్మినల్ను పరిశీలించిన పీఎం..!!
- నిరుద్యోగ అప్పీళ్ల కోసం ఆన్లైన్ వ్యవస్థ..!!
- ఒమన్లో హాకీ5స్ కార్నివాల్..500 మంది ఆటగాళ్లు, 47 జట్లు..!!
- విదేశీ నిపుణులు మాకు అవసరం..ట్రంప్ యూటర్న్
- పెట్టుబడుల సదస్సుకు సన్నాహాలు పూర్తి.. విశాఖకు సీఎం రాక
- తెలుగు రాష్ట్రాల్లో భారీగా తగ్గిన ఉష్ణోగ్రతలు
- ఫోటోలు తీస్తుండగా భవనం పై నుంచి పడి భారతీయ యువకుడు మృతి..!!







