గ్రేడ్ ఆధారంగా జీతం తగ్గిస్తున్న దుబాయ్ సంస్థ..కారణం తెలిస్తే అవాక్కవ్వాల్సిందే
- March 31, 2020
గ్రేడ్ను బట్టి జీతాల్లో తగ్గింపులు...ఏప్రిల్ నుండి అమలు..
యూఏఈ: కోవిడ్ -19 కరోనావైరస్ ప్రభావంతో మారుతున్న మార్కెట్ పరిస్థితుల కారణంగా యూఏఈ లోని ట్రాన్స్గార్డ్ గ్రూప్ సంచలన నిర్ణయం తీసుకుంది. సెక్యూరిటీ, సౌకర్యాల నిర్వహణ, నగదు సేవలు మరియు వైట్ కాలర్ సిబ్బందిని అందించే ట్రాన్స్గార్డ్ గ్రూప్, ప్రస్తుతం తాత్కాలికంగా పనిని కోల్పోయిన 12,000 మంది సైట్ ఆధారిత ఉద్యోగుల ఆహార/నిత్యావసరాలను తీర్చేందుకు ఏప్రిల్లో తమ సంస్థ నిర్వహణ సిబ్బంది జీతాలను తగ్గిస్తున్నట్లు మంగళవారం తెలిపింది.
ఆదివారం సాయంత్రం సిబ్బందికి పంపిన ఇమెయిల్లో, మేనేజింగ్ డైరెక్టర్ గ్రెగ్ వార్డ్, సంస్థ తీసుకున్న ఈ నిర్ణయంతో 12,000+ ఉద్యోగులకు మూడు పూటలా ఆహారం ఒక నెలపాటు సమకూర్చటంలో దోహదపడుతుంది అంటూ వివరణ ఇచ్చారు. ఏప్రిల్ పే స్లిప్లలో ప్రతిబింబించే తగ్గింపులు గ్రేడ్ను బట్టి ఉంటాయనీ, సీనియర్ మేనేజ్మెంట్ వారి జీతాలపై అధిక తగ్గింపులను విధిస్తుంది అని యాజమాన్యం తెలిపింది.
తాజా వార్తలు
- కువైట్ లో ఇద్దరు భారతీయులు మృతి..!!
- జిసిసి 'వన్-స్టాప్' ట్రావెల్ సిస్టమ్ ప్రారంభం..!!
- రియాద్ లో ఆఫాక్ ఆర్ట్స్ అండ్ కల్చర్ అకాడమీ ప్రారంభం..!!
- ‘వన్ ఓషన్, అవర్ ఫ్యూచర్ ’ గ్రాండ్ సక్సెస్..!!
- ఒమన్ ఎయిర్ కొత్త సేఫ్టీ గైడ్ లైన్స్ జారీ..!!
- ఖతార్ లో స్టూడెంట్స్ కంటి సమస్యలపై స్పెషల్ ఫోకస్..!!
- ఖతార్ విధానాలలో శాంతి, భద్రత అంతర్భాగాలు..!!
- అమెరికాతో ప్రాంతీయ పరిస్థితిపై చర్చించిన సౌదీ రక్షణ మంత్రి..!!
- యూఏఈలో త్వరలో డ్రోన్ ఫుడ్ ఆర్డర్ల డెలివరీ..!!
- ఎయిర్పోర్ట్ కొత్త టెర్మినల్ను పరిశీలించిన పీఎం..!!







