దోహా:నిర్మాణ రంగంలోని కార్మికులకు ఆరోగ్య సంరక్షణ కిట్ల పంపిణి
- March 31, 2020
దోహా:పలు దేశాల నుంచి వచ్చిన నిర్మాణ రంగ కార్మికుల ఆరోగ్య పరిరక్షణకు ఖతార్ స్వచ్చంద సంస్థ ముందుకు వచ్చింది. పలు ప్రాంతాల్లో భవన నిర్మాణ రంగంలో పని చేస్తున్న కార్మికులకు మెడికల్ కిట్లను ఉచితంగా అందించింది. కరోనా వైరస్ శరవేగంగా ప్రబలుతున్న ప్రస్తుత తరుణంలో దేశంలోని ప్రతి ఒక్కరి ఆరోగ్య సంరక్షణ ముఖ్యమని సంస్థ నిర్వాహకులు తెలిపారు. హెల్త్ కిట్లతో పాటు కరోనా వైరస్ సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తూ వివిధ భాషల్లో పాంప్లేట్లను కూడా పంచిపెట్టారు. కరోనా వైరస్ నుంచి ఎవరికి వారు ఎలా రక్షించుకోవాలో...ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో కార్మికులకు అవగాహన కల్పించినట్లు దుబాయ్ ఛారిటీ తమ ట్విటర్ ఖాతా ద్వారా తెలిపింది. కార్మికులకు మెడికల్ కిట్లను అందించే ఈ కార్యక్రమంలో కార్మిక పర్యవేక్షణ విభాగం డైరెక్టర్ ఫాహద్ అల్ దోసరి పాల్గొన్నారు.
--రాజ్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు
- జీఎస్టీ 2.0పై సీఎం చంద్రబాబు స్పందన..
- కొత్త కారు కొనేవాళ్లకు ఇక పండగే అంటున్న భారత ప్రభుత్వం