దోహా:నిర్మాణ రంగంలోని కార్మికులకు ఆరోగ్య సంరక్షణ కిట్ల పంపిణి
- March 31, 2020
దోహా:పలు దేశాల నుంచి వచ్చిన నిర్మాణ రంగ కార్మికుల ఆరోగ్య పరిరక్షణకు ఖతార్ స్వచ్చంద సంస్థ ముందుకు వచ్చింది. పలు ప్రాంతాల్లో భవన నిర్మాణ రంగంలో పని చేస్తున్న కార్మికులకు మెడికల్ కిట్లను ఉచితంగా అందించింది. కరోనా వైరస్ శరవేగంగా ప్రబలుతున్న ప్రస్తుత తరుణంలో దేశంలోని ప్రతి ఒక్కరి ఆరోగ్య సంరక్షణ ముఖ్యమని సంస్థ నిర్వాహకులు తెలిపారు. హెల్త్ కిట్లతో పాటు కరోనా వైరస్ సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తూ వివిధ భాషల్లో పాంప్లేట్లను కూడా పంచిపెట్టారు. కరోనా వైరస్ నుంచి ఎవరికి వారు ఎలా రక్షించుకోవాలో...ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో కార్మికులకు అవగాహన కల్పించినట్లు దుబాయ్ ఛారిటీ తమ ట్విటర్ ఖాతా ద్వారా తెలిపింది. కార్మికులకు మెడికల్ కిట్లను అందించే ఈ కార్యక్రమంలో కార్మిక పర్యవేక్షణ విభాగం డైరెక్టర్ ఫాహద్ అల్ దోసరి పాల్గొన్నారు.
--రాజ్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







