దోహా: నిర్భంధంలో ఉన్న కార్మికులకు పూర్తి జీతం..
- April 01, 2020
దోహా:కరోనా వైరస్ ను కట్టడి చేసేందుకు ఖతార్ ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. అయితే..డెవలప్మెంట్ పనులకు ఎలాంటి ఆటంకం కలగకుండా తగు జాగ్రత్తలు కూడా తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో ఆయా రంగాల్లో పని చేస్తున్న కార్మికుల ఆరోగ్యం విషయంలో ఎప్పటికప్పుడు సమాచారం అందించేలా హట్ లైన్(92727) ఏర్పాటు చేసిన ఖతార్ ప్రభుత్వం...కరోనా లక్షణాలతో నిర్బంధ శిబిరాలకు వెళ్లాల్సి వచ్చే కార్మికులకు ఊరటనిస్తూ మరో ప్రకటన వెలువరించింది. నిర్బంధంలో ఉన్న కాలానికి సంబంధించి జీతంలో కోత విధించకూడదని కార్మిక, సాంఘిక సంక్షేమ పరిపాలన మంత్రిత్వ శాఖ ఆయా రంగాలకు సూచించింది. పూర్తి జీతం చెల్లించాల్సిందేనని స్పష్టం చేసింది.
ఇదిలాఉంటే..కరోనా వ్యాప్తి నివారణలో భాగంగా లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కఠినంగా ఉంటామని హెచ్చరించిన ఖతార్ అధికారులు ఆ దిశగా చర్యలు కూడా చేపట్టారు. సౌతర్న్ ఖతార్ లో ఒకే చోట గుమికూడిన పది మందిని అరెస్ట్ చేశారు. లాక్ డౌన్ కాలం ముగిసే వరకు ఎవరు ఒకే చోట గుమికూడవద్దని మరోసారి హెచ్చరించారు.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!