దోహా: నిర్భంధంలో ఉన్న కార్మికులకు పూర్తి జీతం..
- April 01, 2020దోహా:కరోనా వైరస్ ను కట్టడి చేసేందుకు ఖతార్ ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. అయితే..డెవలప్మెంట్ పనులకు ఎలాంటి ఆటంకం కలగకుండా తగు జాగ్రత్తలు కూడా తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో ఆయా రంగాల్లో పని చేస్తున్న కార్మికుల ఆరోగ్యం విషయంలో ఎప్పటికప్పుడు సమాచారం అందించేలా హట్ లైన్(92727) ఏర్పాటు చేసిన ఖతార్ ప్రభుత్వం...కరోనా లక్షణాలతో నిర్బంధ శిబిరాలకు వెళ్లాల్సి వచ్చే కార్మికులకు ఊరటనిస్తూ మరో ప్రకటన వెలువరించింది. నిర్బంధంలో ఉన్న కాలానికి సంబంధించి జీతంలో కోత విధించకూడదని కార్మిక, సాంఘిక సంక్షేమ పరిపాలన మంత్రిత్వ శాఖ ఆయా రంగాలకు సూచించింది. పూర్తి జీతం చెల్లించాల్సిందేనని స్పష్టం చేసింది.
ఇదిలాఉంటే..కరోనా వ్యాప్తి నివారణలో భాగంగా లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కఠినంగా ఉంటామని హెచ్చరించిన ఖతార్ అధికారులు ఆ దిశగా చర్యలు కూడా చేపట్టారు. సౌతర్న్ ఖతార్ లో ఒకే చోట గుమికూడిన పది మందిని అరెస్ట్ చేశారు. లాక్ డౌన్ కాలం ముగిసే వరకు ఎవరు ఒకే చోట గుమికూడవద్దని మరోసారి హెచ్చరించారు.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- 7 వికెట్ల తేడాతో హైదరాబాద్ పై ముంబై విజయం
- ప్రపంచ రెండో ర్యాంకర్కు షాకిచ్చిన మనిక బాత్రా…
- TSRTC: పాస్ ఉంటే డీలక్స్ బస్సులోనూ ప్రయాణం…
- సింగపూర్ లో ప్రవాస భారతీయులతో పుస్తక ఆవిష్కరణ చేసిన డా.రామ్ మాధవ్
- SQU డే.. రాయల్ గ్రాంట్ గెలుచుకున్న ఏడు ప్రాజెక్టులు
- యూఏఈలో ఉల్లి ధరలు తగ్గుతాయా?
- విద్యార్థులకు శుభవార్త చెప్పిన CBSE
- ప్రయాణికుల మధ్య గొడవ.. విమానం ఆలస్యం
- సౌదీలో 9శాతం పెరిగిన నాన్-ఆయిల్ ఆదాయం
- ‘బహ్రెయిన్ బోర్స్’కు ఉత్తమ అరబ్ స్టాక్ ఎక్స్ఛేంజ్ అవార్డు