కరోనా ఎఫెక్ట్: ప్రభుత్వ,ప్రైవేట్ సంస్థల లెటర్ ఉంటేనే ఉద్యోగులకు అనుమతి.
- April 02, 2020మస్కట్:కరోనా వైరస్ కారణంగా దేశమంతా కర్ఫ్యూ పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో ఒమన్ భద్రతా అధికారులు ఉద్యోగుల కోసం ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వ ఉద్యోగులైనా, ప్రైవేట్ ఉద్యోగులైనా తప్పనిసరిగా తమ సంస్థల నుంచి లెటర్ తీసుకోవాలని అధికారులు సూచించారు. ఆయా సంస్థల సీల్ తో పాటు సదరు ఉద్యోగి ఏ తరహా విధులు నిర్వహిస్తున్నాడు..ఎందుకోసం అతని సేవలు అత్యవసరమని భావిస్తున్నారో కూడా లేఖలో పేర్కొనాలని కోరారు. దేశ పౌరులతో పాటు నివాసితులు(రెసిడెంట్స్) లెటర్ తో పాటు తమ సివిల్, ఐడీ కార్డులను తప్పకుండా వారితోనే ఉంచుకోవాలని కూడా అధికారులు సూచించారు. దేశంలో పలు చోట్ల రాయల్ ఆర్మ్డ్ ఫోర్సెస్, రాయల్ ఒమన్ పోలీసులు సంయుక్తంగా చెక్ పోస్టులను ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఉద్యోగులు సంబంధిత డాక్యుమెంట్లు చూపిస్తేనే అనుమతిస్తారని అధికారులు స్పష్టం చేశారు.
--లెనిన్ కుమార్ (మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్లో విస్తరిస్తున్న తుఫాన్..?
- మహిళల టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..
- రేపు రాజమండ్రికి మోడీ రాక..ట్రాఫిక్ ఆంక్షలు
- పార్కులు, ప్లేగ్రౌండ్ల కోసం కొత్త సమయాలు