ఇండియా: ఏప్రిల్ 15న లాక్డౌన్ ఎత్తివేత
- April 02, 2020న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా విస్తరిస్తున్న కరోనా వైరస్ వ్యాప్తిని నివారించేందుకు దేశ వ్యాప్తంగా 21 రోజుల పాటు లాక్డౌన్ విధించిన విషయం తెలిసిందే. దీంతో అన్ని రంగాలు తీవ్ర నష్టాలను ఎదర్కొంటున్నాయి. ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ క్రమంలోనే లాక్డౌన్ను మరికొన్ని రోజుల పాటు పొడిగించే అవకాశం ఉందంటూ వార్తలు కూడా వచ్చాయి. అయితే వీటిని కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. అయినా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఏప్రిల్ 15న లాక్డౌన్ను ఎత్తివేస్తారా..? లేదా అనే ప్రశ్న అనేక మందిలో ఉత్పన్నమవుతోంది. ఈ క్రమంలో గురువారం ప్రధాని నరేంద్ర మోదీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు.
అయితే ఈ సమావేశం అనంతరం అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పేమాఖండూ చేసిన ట్వీట్ ఆసక్తికరంగా మారింది. ప్రధానిలో సమావేశం అనంతరం ఆయన ట్వీట్ చేస్తూ ఏప్రిల్ 15న లాక్డౌన్ను ఎత్తివేయనున్నట్లు తెలిపారు. కానీ ప్రజలంతా బయటకు రావడానికి కొన్ని పరిమితులు మాత్రం ఉంటాయని పేర్కొన్నారు. అలాగే లాక్డౌన్ ఎత్తివేసినా.. సామాజిక దూరంతో మాత్రమే కరోనా వైరస్ వ్యాప్తిని నివారించగలమని వివరించారు. సీఎం ట్వీట్తో ఏప్రిల్ 15న లాక్డౌన్ ఎత్తివేస్తారని అర్థమవుతోంది.
తాజా వార్తలు
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..