కరోనా వైరస్ ను అడ్డుకునేందుకు స్వీయ నిర్బంధం యాప్ ప్రారంభించిన యూఏఈ
- April 04, 2020కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు స్వీయ నిర్బంధం పాటించాల్సిన వారి విషయం యూఏఈ ప్రభుత్వం నిక్కచ్చిగా వ్యవహరిస్తోంది. విదేశాల నుంచి వచ్చినా, కరోనా పాజిటీవ్ వ్యక్తులతో ప్రైమరీ కాంటాక్ట్ లో ఉన్నా తప్పనిసరిగా నిర్బంధం పాటించాల్సి ఉంటుంది. అయితే..కొందరు నిర్బంధం పాటించకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ వైరస్ వ్యాప్తికి కారణమవుతున్నారు. దీంతో యూఏఈ నిర్బంధంలో ఉన్న వారిపై నిఘా వేసేందుకు ప్రత్యేకంగా ఓ Stay Home యాప్ ను ప్రారంభించింది. నిర్బంధం పాటించాల్సిన వ్యక్తులు తప్పనిసరిగా తమ మొబైల్ లో యాప్ డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. దీంతో వారు ఎటూ కదిలినా అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంటారు. అలా నిర్బంధం పాటించని వ్యక్తులను వెంటనే పసిగట్టి వైరస్ వ్యాప్తిని అడ్డుకునేలా యూఏఈ చర్యలు తీసుకుంటోంది.
తాజా వార్తలు
- 7 వికెట్ల తేడాతో హైదరాబాద్ పై ముంబై విజయం
- ప్రపంచ రెండో ర్యాంకర్కు షాకిచ్చిన మనిక బాత్రా…
- TSRTC: పాస్ ఉంటే డీలక్స్ బస్సులోనూ ప్రయాణం…
- సింగపూర్ లో ప్రవాస భారతీయులతో పుస్తక ఆవిష్కరణ చేసిన డా.రామ్ మాధవ్
- SQU డే.. రాయల్ గ్రాంట్ గెలుచుకున్న ఏడు ప్రాజెక్టులు
- యూఏఈలో ఉల్లి ధరలు తగ్గుతాయా?
- విద్యార్థులకు శుభవార్త చెప్పిన CBSE
- ప్రయాణికుల మధ్య గొడవ.. విమానం ఆలస్యం
- సౌదీలో 9శాతం పెరిగిన నాన్-ఆయిల్ ఆదాయం
- ‘బహ్రెయిన్ బోర్స్’కు ఉత్తమ అరబ్ స్టాక్ ఎక్స్ఛేంజ్ అవార్డు