కరోనా ఎఫెక్ట్:సుప్రీం కమిటీ నిబంధనలు అతిక్రమించిన షాపు మూసివేత

- April 04, 2020 , by Maagulf
కరోనా ఎఫెక్ట్:సుప్రీం కమిటీ నిబంధనలు అతిక్రమించిన షాపు మూసివేత

మస్కట్:కరోనా వైరస్ నేపథ్యంలో సుప్రీం కమిటీ జారీ చేసిన నిబంధనలను పాటించని ఓ షాపును మస్కట్ మున్సిపాలిటీ అధికారులు మూసివేయించారు. బౌషర్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మూసివేసిన షాపులో మొబైల్ ఫోన్లు, కంప్యూటర్ విడి భాగాలు అమ్ముతున్నట్లు అధికారులు తెలిపారు. కరోనా వైరస్ కు సంబంధించి అపోహలకు తావిచ్చేలా ప్రవర్తించిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూ సుప్రీం కమిటీ కొన్ని నిబంధనలను సూచించిన విషయం తెలిసిందే. అయితే..షాపు నిర్వాహకులు కమిటీ నిబంధనలు పాటించకపోవటం వల్లే రాయల్ ఒమన్ పోలీసుల సహకారంతో చర్యలు తీసుకున్నట్లు మున్సిపాలిటీ అధికారులు చెబుతున్నారు. 

--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,మస్కట్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com