సీసీసీకి రూ.5 లక్షలు అందజేసిన మైత్రీ మూవీ మేకర్స్..
- April 04, 2020
కరోనా వైరస్పై పోరాటంలో భాగమవుతూ ఇదివరకే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సీఎం సహాయనిధులకు చెరొక రూ. 10 లక్షల చొప్పున రూ. 20 లక్షలను విరాళంగా ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ అధినేతలు నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ అందజేశారు. తాజాగా శనివారం కరోనా క్రైసిస్ చారిటీ (సీసీసీ)కి మరో రూ. 5 లక్షలను వారు అందజేశారు. ఈ విషయాన్ని నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ తమ సంస్థ అధికారిక ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలిపారు. "రూ. 20 లక్షలకు అదనంగా.. లాక్డౌన్ నేపథ్యంలో సినిమా షూటింగ్లు లేక ఉపాధి కోల్పోయిన పేద కళాకారులు, కార్మికులను ఆదుకోవడం కోసం చిరంజీవి గారు ఏర్పాటుచేసిన కరోనా క్రైసిస్ చారిటీకి కూడా మేం రూ. 5 లక్షలు విరాళంగా అందజేస్తున్నాం. కరోనా మహమ్మారిపై పోరాటంలో మేం చేతులు కలుపుతున్నాం. ఈ విషయంలో అందరం ఒక్కటవుదాం. ఇంట్లో ఉండండి.. జీవితాలను కాపాడుకోండి" అని వారు ట్వీట్ చేశారు.
తాజా వార్తలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం విఫలం.. వైమానిక రక్షణ వ్యవస్థల విజయవంతమైన ప్రతిఘటన
- ఢిల్లీలో కుండపోత వర్షం..ఆరెంజ్ అలర్ట్ జారీ
- లోగో డిజైన్ చేయండి.. రూ.లక్ష గెలుచుకోండి: తెలంగాణ హౌసింగ్ బోర్డు
- ట్రంప్ ఆదేశాలతో ఇరాన్ పై అమెరికా సైన్యం భీకర దాడులు..
- ఈ-వేస్ట్ నిర్వహణలో సౌదీకి అంతర్జాతీయ గుర్తింపు..!!
- శంషాబాద్ వద్ద ఘోరరోడ్డు ప్రమాదం..
- మెల్బోర్న్లో ప్రధాని మోదీకి ఘనస్వాగతం..
- కువైట్ అగ్రనేతలతో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ భేటీ..!!
- సిరియా పై ట్రంప్ కీలక నిర్ణయం..
- ఇరాన్ దాడుల్లో దెబ్బతిన్న ఇళ్ల మరమ్మతుల పురోగతిపై సమీక్ష..!!







