ఫుడ్ ప్యాకింగ్పై ఫోకస్ పెట్టిన అసిర్ మునిసిపాలిటీ
- April 07, 2020సౌదీ అరేబియాకి చెందిన అసిర్ మునిసిపాలిటీ, తమ ప్రాంతంలోని రెస్టారెంట్స్ ఫుడ్ ప్యాకింగ్ విషయంలో భద్రత పరంగా అత్యంత జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. కరోనా వైరస్ వ్యాప్తి జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలనీ, భద్రతతో కూడిన పరిశుభ్రమైన ప్యాకింగ్ని వినియోగదారులకు అందించాలని అసిర్ మునిసిపాలిటీ, రెస్టారెంట్లకు సూచించింది. కరోనా వైరస్ తీవ్రత నేపత్యంలో వృద్ధులకు అలాగే డిసేబిలిటీతో బాధపడుతున్నవారి కోసం ప్రత్యేక సహాయక చర్యలు చేపడుతున్నారు. మరోపక్క, సౌదీ ఫుడ్ అండ్ డ్రగ్ అథారిటీ, హెల్త్ అవేర్నెస్ని పెంచే క్రమంలో ఇంటరాక్టివ్ కమ్యూనికేషన్ని ప్రారంభించింది. వాట్సాప్ ఛాట్బోట్ వంటివి ఇందులో వున్నాయి. ప్రస్తుతం 2463 కరోనా పాజిటివ్ కేసులు కింగ్డమ్లో వున్నాయి. వీరిలో 488 మంది రికవర్ అవగా, 34 మంది ప్రాణాలు కోల్పోయారు.
తాజా వార్తలు
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్..
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్లో విస్తరిస్తున్న తుఫాన్..?