కరోనా నివారణకు రామ్ తళ్లూరి 5.5 లక్షల విరాళం
- April 07, 2020
కరోనా వైరస్ బాధితుల సహాయార్థం అలానే కరోనా నివారణకు కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న నివారణ చర్యలకు తమ వంతు సహాయార్ధం పలువురు పారిశ్రామికవేత్తలు, తెలుగు సినిమా ఇండస్ట్రీ ప్రముఖులు భారీ విరాళాలు అందిస్తున్నారు. కరోనా పై పోరాటానికి ప్రముఖ నిర్మాత, పారిశ్రామికవేత్త రామ్ తళ్లూరి కూడా ముందుకొచ్చారు. 5.5 లక్షల రూపాయలు విరళాన్ని ప్రకటించారు. ఈ మొత్తంలో 5 లక్షల రూపాయలు తెలంగాణ ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ కి మరో యాభై వేలు విలువ చేసే నిత్య అవసరాల సరుకులు సినీ కార్మీకులకు అందించారు. తాను అధినేతగా వ్యవహరిస్తున్న లీడ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, స్కై జోన్ ఇండియా సంస్ధలు తరుపున రామ్ తళ్లూరి ఈ విరాళం అందించడం జరిగింది. గత నెలలో తన కంపెనీ పని మీద అమెరికా వెళ్లిన రామ్ తళ్లూరి లాక్ డౌన్ నేపథ్యంలో అక్కడే నిలిచిపోయారు.
తాజా వార్తలు
- తెలంగాణకే 3 బులెట్ ట్రైన్స్: కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్
- గాన కోకిల ఎస్.జానకి కన్నుమూత
- సీఎం రేవంత్తో ఎమిరేట్స్ వైస్ ప్రెసిడెంట్ భేటీ.. కీలక అంశాల పై చర్చ
- అమెరికాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను అప్పగించిన ఖతార్..!!
- ద్వైపాక్షిక, ప్రాంతీయ పరిస్థితులపై అమెరికా–సౌదీ చర్చలు..!!
- సలాలా తీరంలో ఒమన్ పౌరుడిని రక్షించిన కోస్ట్ గార్డ్..!!
- కువైట్లో వారాంతంలో తీవ్రమైన ఎండలు.. హెచ్చరిక..!!
- అల్ మజారె స్ట్రీట్ విస్తరణకు అధ్యయనం.. ట్రాఫిక్ సమస్యలకు చెక్..!!
- సమ్మర్ లో పిల్లల భద్రతపై ఫుజైరా పోలీసుల హెచ్చరిక..!!
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్







